వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపీ మరోసారి అభాసుపాలైంది: కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు

వైసీపీ అధినేత జగన్‌పై ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ఈసీని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. సీఎంకు ఆహారం తెచ్చే వాహనం పై తప్పుడు ఆరోపణలు చేశారంటూ మండిపడ్డారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

విజయవాడ: వైసీపీ అధినేత జగన్‌పై ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ఈసీని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. సీఎంకు ఆహారం తెచ్చే వాహనం పై తప్పుడు ఆరోపణలు చేశారని, వైసీపీ దొంగల ముఠా నంద్యాలలో తిష్టవేసి విమర్శలు చేస్తోందని మండిపడ్డారు.

వైసీపీ మౌత్ పీస్‌లా మారిన సాక్షి పేపర్, సాక్షి టీవీని బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. ఓటమి భయంతోనే వైసీపీ నేతలు తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని, నంద్యాలలో వైసీపీ ఓటమి ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. జగన్ కుయుక్తులు నంద్యాలలో పనిచేయవని కేశినేని నాని అన్నారు.

వైసీపీ దిగజారుడు రాజకీయాలు: కొనకళ్ల

ఓటమి భయంతో వైసీపీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతుందని ఎంపీ కొనకళ్ల నారాయణ మండిపడ్డారు. చంద్రబాబు వ్యక్తిగత వాహనంపై ఆరోపణలు చేసి అభాసు పాలయ్యారని ఎద్దేవాచేశారు. జగన్‌ది హత్యా రాజకీయాల చరిత్ర అని, జగన్‌పై 16 కేసులున్నాయని, జైలుకెళ్లడం ఖాయమని నారాయణ జోస్యం చెప్పారు.

English summary
TDP MP Kesineni Nani critisized YCP Chief YS Jagan Mohan Reddy here in Vijayawada on Saturday that YS Jagan is misleading Election Commission. He demanded that government should ban YCP mouth pieces Sakshi News Paper and Sakshi TV. And he also stated that YCP giving wrong complaints because of the defeat fear in Nandyal Bypoll.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X