దాసరి కోసం ప్రార్థించండి: మోహన్ బాబు, మరో 24గంటలు అబ్జర్వేషన్లో
దాసరిని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రజలంతా మంచి మనసుతో దాసరి ఆరోగ్యం కోసం కోసం ప్రార్థించాలని మోహన్ బాబు కోరారు.
హైదరాబాద్: ఊపిరితిత్తులు, కిడ్నీ, మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్న మాజీ కేంద్రమంత్రి దాసరి నారాయణరావు ప్రస్తుతం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న సంగతి తెలిసిందే. కిమ్స్ హాస్పిటల్ సీఈవో బొల్లినేని భాస్కర్ రావు దాసరి తాజా ఆరోగ్య పరిస్థితి గురించి మీడియాకు వివరించారు.
దాసరికి ఈరోజు డయాలసిస్ చేయాల్సిన అవసరం రాలేదని భాస్కర్ రావు చెప్పారు. అయితే మరో 24 గంటల పాటు ఆయన్ను అబ్జర్వేషన్ లో ఉంచుతున్నట్టుగా తెలిపారు. దాసరి ఆరోగ్యంపై ఆందోళన అవసరం లేదని చెప్పారు.
దాసరి కోసం ప్రార్థించండి: మోహన్ బాబు
దాసరి ఆసుపత్రిలో చేరినప్పటినుంచి నిత్యం ఆసుపత్రికెళ్లి ఆయన బాగోగులను చూసుకుంటున్నారు సినీ నటుడు మోహన్ బాబు. బుధవారం నాడు కూడా ఆయన కిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు.

దాసరిని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రజలంతా మంచి మనసుతో దాసరి ఆరోగ్యం కోసం ప్రార్థించాలని ఆయన కోరారు. ఆయన ఆరోగ్యం బాగుపడాలని షిర్డీ సాయినాథుడిని వేడుకునేందుకు వెళ్తున్నానని అన్నారు.
దాసరి ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వస్తే.. ఎన్నో కుటుంబాలు బాగుపడుతాయని మోహన్ బాబు అన్నారు. ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications