కొత్త పార్టీ అవసరం, చిరు పెట్టినప్పుడూ: సబ్బం, హర్ష

సీమాంధ్ర ప్రజలు కొత్త పార్టీ కోసం ఎదురు చూస్తున్నారని చెప్పామన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకే కొత్త పార్టీ ఏర్పడనుందన్నారు. మిగతా ఎంపీలు, ఎమ్మెల్యేలతో కిరణ్ మాట్లాడుతారన్నారు. కిరణ్ వెంట ముఖ్యమైన నేతలు, మంత్రులు లేరు కదా అని ప్రశ్నిస్తే... ఎన్టీఆర్, చిరంజీవిలు పార్టీ పెట్టినప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు వెంట లేరన్నారు.
పార్టీ పెట్టాలనే నిర్ణయం తీసుకున్నార, ఎప్పుడు, ఎలా, అజెండా ఏమిటో చెబుతామన్నారు. ప్రస్తుతం ఎంపీలతో కిరణ్ భేటీ అయ్యారని, రేపు లేదా ఎల్లుండి మరికొందరు నేతలతో భేటీ అవుతారన్నారు. కిరణ్ పార్టీ పెడితే ప్రజలు ఆదరిస్తారన్నారు. సీమాంధ్ర ప్రజల ఆత్మ గౌరవం ఢిల్లీకి చాటి చెప్పేందుకు కొత్త పార్టీ అవసరమన్నారు.
కాగా, కిరణ్తో జరిగిన భేటీలో హర్ష కుమార్, సబ్బం హరి, లగడపాటి రాజగోపాల్, సాయి ప్రతాప్, ఉండవల్లి అరుణ్ కుమార్, రాయపాటి సాంబశివ రావు, శైలజానాథ్ తదితరులు భేటీ అయ్యారు.












Click it and Unblock the Notifications