ప్రస్తుత బిల్లును ఆమోదిస్తేనే: సన్యాసంపై సిఎం ట్విస్ట్
హైదరాబాద్: శాసనసభ తిరస్కరించిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ బిల్లును (తెలంగాణ బిల్లును) యథాతథంగా పార్లమెంటులో ఆమోదిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణ బిల్లును శాసనసభ, శాసన మండలి రెండూ బిల్లును తిరస్కరించాయని, దీన్ని కేంద్రం గౌరవించాలని ఆయన అన్నారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన కిరణ్ కుమార్ రెడ్డి గురువారంనాడు పార్టీ అధిష్టానంపై, కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
రాజకీయాల నుంచి తప్పుకుంటానంటే కొత్త పార్టీ పెడతానని కాదని ఆయన అన్నారు. కొత్త పార్టీ పెట్టడమనేది తనకు ప్రధానాంశం కాదని, రాష్ట్ర భవిష్యత్తు తనకు ముఖ్యమని ఆయన అన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకే బిల్లును తిరస్కరించామని ఆయన అన్నారు. రాజకీయ జీవితం కన్నా రాష్ట్ర సమైక్యతే తనకు ముఖ్యమని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రజల అభీష్టాన్ని కేంద్రం గౌరవించాలని ఆయన అన్నారు.

బిల్లును శానససభ, మండలి తిరస్కరించిన తర్వాత ముందుకు వెళ్లడం ప్రజాస్వామ్యం అనిపించుకోదని ఆయన అన్నారు. తెలుగు ప్రజల భవిష్యత్తును ఢిల్లీ నిర్ణయించకూడదని ఆయన అన్నారు. విభజన రాజకీయాలకు, రాజకీయ పార్టీలకు సంబంధం పెట్టకూడదని ఆయన అన్నారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాగమని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పెద్ద తిప్పదమని ఆయన అన్నారు. తెలంగాణ ఏర్పడితే మనుగడ సాగించలేదని ఆయన అన్నారు. అధిష్టానం తప్పు చేయడం వల్లనే తాను ప్రజల తరఫున పోరాడుతున్నానని ఆయన అన్నారు.
రాష్ట్ర సమైక్యత కోసం ఎంతకైనా తెగిస్తానని ఆయన అన్నారు. తన రాజకీయ భవిష్యత్తును పట్టించుకోనని, రాష్ట్ర భవిష్యత్తు తనకు ప్రధానమని ఆయన అన్నారు. తెలంగాణ కావాలో, వద్దో ప్రజలు వచ్చే లోకసభ ఎన్నికల్లో తేలుస్తారని ఆయన అన్నారు. విభజన జరిగితే విద్య, నీరు వంటి వివిధ రంగాల్లో సమస్యలు వస్తాయని ఆయన అన్నారు. హైదరాబాద్ పెద్ద సమస్య అని ఆయన అన్నారు.
భవిష్యత్తు కార్యాచరణ కోసం తాము సమావేశమవుతున్నట్లు ఆయన తెలిపారు. ఏది ఏమైనా రాష్ట్రాన్ని కాపాడుకుంటామని ఆయన అన్నారు. బిల్లును ప్రభుత్వానికి పంపవద్దని రాష్ట్రపతిని శాసనసభ కోరుతుందని ఆయన చెప్పారు. ప్రజల మనోభావాలను గౌరవించాలని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీ ప్రజలకు దూరమైందని, తాను ప్రజల తరఫున నిలబడ్డానని ఆయన అన్నారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!











Click it and Unblock the Notifications