కిషన్: టెక్కీలకు నమో చాయ్, రైలు జర్నీ (పిక్చర్స్)
హైదరాబాద్: దేశవ్యాప్తంగా నమో చాయ్ బ్రాండ్కు గిరాకీ పెరిగేట్లే ఉంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి గురువారంనాడు నమో చాయ్వాలాగా అవతారమెత్తారు. ఆయన హైటెక్ సిటీలో చాయ్ అందిస్తూ తమ పార్టీ నేత నరేంద్ర మోడీని ప్రధాన మంత్రిగా చేయాలని ప్రచారం చేశారు. టెక్కీలకు ఆయన చాయ్ అందించారు.
నరేంద్ర మోడీని ప్రధాన మంత్రిని చేయాలనే నినాదంతో కిషన్ రెడ్డి గురువారంనాడు ఎంఎంటిఎస్ రైలులో ప్రయాణించారు. నెక్లెస్ రోడ్డు నుంచి ఆయన హైటెక్ సిటీకి వెళ్లారు. ఈ సమయంలో ఆయన ఐటి ఉద్యోగులతో మాట్లాడారు. నరేంద్ర మోడీ కోసం ప్రచారం సాగించారు.
హైటెక్ సిటీలో చాయ్వాలాలతో మాట్లాడారు. చాయ్ చేస్తూ, అందిస్తూ ఆయన టెక్కీలతో మాట్లాడారు. బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ కోసం ప్రచారం సాగించారు. ఇటీవల బిజెపి సీనియర్ నేత ఎం. వెంకయ్య నాయుడు విజయవాడలోనూ అనంతపురంలోనూ ఇలాగే చాయ్ వాలాగా అవతారమెత్తారు.
కిషన్ రెడ్డి నమో చాయ్
హైటెక్ సిటీలో బిజెపి రాష్ట్రాధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి హైదరాబాదులోని హైటెక్ సిటీలో చాయ్ సర్వ్ చేస్తూ ప్రచార కార్యక్రమం చేపట్టారు.
కిషన్ రెడ్డి నమో చాయ్
నరేంద్ర మోడీని ప్రధాన మంత్రిని చేయాలని కోరుతూ ఆయన ఇలా చాయ్ వంపుతూ కనిపించారు. చాయ్ వాలా ప్రధాని కారని కాంగ్రెసు నేతలు చేసిన వ్యాఖ్యలకు దాన్ని ప్రచారాస్త్రంగా బిజెపి నేతలు ఎన్నుకున్నారు.
కిషన్ రెడ్డి నమో చాయ్
బిజెపి రాష్ట్రాధ్యక్షుడు చాయ్ను వేడి చేస్తూ పాత్రలో దాన్న కలుపుతూ ఇలా ప్రచార కార్క్రమం చేపట్టారు.
ఐటి ఉద్యోగులతో కిషన్ రెడ్డి
బిజెపి రాష్ట్రాధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి గురువారంనాడు ఎంఎంటిఎస్ రైలు ప్రయాణించి ఐటి ఉద్యోగులతో ముచ్చట పెట్టారు.
ఐటి ఉద్యోగులతో కిషన్ రెడ్డి
ఐటి ఉద్యోగులకు నరేంద్ర మోడీని ప్రధాన మంత్రిగా చేయాల్సిన అవసరాన్ని తెలియజేయడానికి ఆయన హైటెక్ సిటీకి వెళ్లారు.