మళ్లీ యాక్టివ్ అయిన కొడాలి నాని, రాధాతో భేటీ - మారుతున్న లెక్కలు..!!
ఏపీ రాజకీయాల్లో కీలక సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. కూటమి పార్టీలు మాజీ సీఎం జగన్ లక్ష్యంగా రాజకీయ వ్యూహాలు అమలు చేస్తున్నాయి. అటు జగన్ సైతం కూటమి ప్రభుత్వం పైన పోరుబాట ప్రారంభించారు. ఇప్పటి వరకు కేసులు ఎదుర్కొన్న వైసీపీ నేతలు తిరిగి తన నియోజకవర్గాల్లో రాజకీయంగా యాక్టివ్ అవుతున్నారు. తాజాగా జగన్ తో భేటీ తరువాత తిరిగి కొత్త కార్యాచరణ ప్రారంభించారు. వంగవీటి రాధాతో సమావేశం ఆసక్తి కరంగా మారింది.
మాజీ మంత్రి కొడాలి నాని తిరిగి రాజకీయంగా క్రియాశీలకంగా మారుతున్నారు. గుండె ఆపరేషన్ కారణంగా కొద్ది నెలలు నాని విశ్రాంతిలో ఉన్నారు. ప్రస్తుతం తిరిగి కోలుకున్నారు. కేసులను కోర్టు లో ఎదుర్కొంటున్నారు. తాజాగా మాజీ సీఎం జగన్ తో కొడాలి నాని తన సహచరుడు వల్లభనేని వంశీతో కలిసి భేటీ అయ్యారు. భవిష్యత్ కార్యాచరణ పైన చర్చించారు. నాని - వంశీకి కొత్త బాధ్యత లు అప్పగించాలని జగన్ డిసైడ్ అయ్యారు.

జగన్ లండన్ పర్యటన తరువాత వీరిద్దరికీ కొత్త బాధ్యతల పైన జగన్ నిర్ణయం వెల్లడించనున్నారు. ఇదే సమయంలో ఈ ఇద్దరు నేతలు వంగవీటి రాధా నివాసంలో జరిగిన ఒక ఫంక్షన్ కు హాజరయ్యారు. రాధాతో ఈ ఇద్దరికీ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. 2024 ఎన్నికల ఫలితాల తరువాత వీరంతా ఒకే వేదిక మీదకు రావటం రాజకీయంగా ఆసక్తి కరంగా మారింది.
అటు వంగవీటి రాధా టీడీపీలోనే ఉన్నప్పటికీ.. క్రియాశీలకంగా లేరు. 2019 ఎన్నికల ముందే రాధాకు టీడీపీ చేరే సమయంలో ఎమ్మెల్సీ పదవి పైన హామీ ఇచ్చారు. ఆ తరువాత 2019 ఎన్నికల్లో టీడీపీ అధికారం కోల్పోయింది. ఆ సమయంలో రాధా రాజకీయంగా మౌనంగానే ఉన్నారు. కాగా.. 2024 ఎన్నికల సమయంలో టీడీపీకి అనుకూలంగా ప్రచారం చేసారు.
పవన్ తో నూ సమావేశం అయ్యారు. అయితే.. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత తొలి విడతలోనే రాధాకు ఎమ్మెల్సీ ఇస్తారని అంచనా వేసారు. ఇప్పటి వరకు రాధాకు పదవి దక్కలేదు. కాగా, రాధా రాజకీయ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. 2024 ఎన్నికల ముందే రాధాను వైసీపీలోకి తీసుకొచ్చేందుకు కొడాలి నాని - వంశీ ప్రయత్నించారు. ఆ సమయంలో రాధా అంగీకరించలేదు.
అయితే, ఇప్పుడు మారుతున్న సమీకరణాల్లో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. వంగవీటి రాధా నివాసంలో జరిగిన కార్యక్రమంలో హాజరయ్యేందుకే నాని- వంశీ వచ్చారని చెబుతున్నారు. అయితే, రాజకీయంగా మాత్రం రానున్న రోజుల్లో ఎలాంటి సమీకరణాలు చోటు చేసుకుంటాయనే ఆసక్తి కర చర్చ సాగుతోంది.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications