వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కోడెల భేటీ .. ఇనుమెట్ల ఘటనపై చర్చ

|
Google Oneindia TeluguNews

ఏపీ స్పీకర్ గా వ్యవహరించిన కోడెల శివప్రసాదరావుపై రాజుపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు . కోడెలతో పాటు 22 మంది టీడీపీ కార్యకర్తలపైనా కేసు నమోదు చేసిన గుంటూరు జిల్లా రాజుపాలెం పోలీసులు ఈ కేసులో కోడెలను ఏ3గా పేర్కొన్నారు.

ఆ అభియోగాలతోనే ఏపీ స్పీకర్ గా వ్యవహరించిన కోడెలపై కేసు నమోదు ఆ అభియోగాలతోనే ఏపీ స్పీకర్ గా వ్యవహరించిన కోడెలపై కేసు నమోదు

కొత్త మలుపులు తిరుగుతున్న ఇనుమెట్ల ఘటన

కొత్త మలుపులు తిరుగుతున్న ఇనుమెట్ల ఘటన

కోడెలపై దాడి వ్యవహారంలో మొదట ఇనుమెట్లలో నిందితులను అరెస్ట్ చేసి , కొందరు వైసీపీ నాయకుల మీద కేసులు నమోదు చేశారు పోలీసులు . అయితే ఈ దాడి వ్యవహారంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని పోలింగ్ బూత్ లోపలి వెళ్లి తలుపులు పెట్టుకుని పోలింగ్ బూత్ ను తన అధీనంలోకి తెచ్చుకున్నందుకు కోడెలపై కేసు నమోదు చెయ్యాలని వైసీపీ నేత అంబటి డిమాండ్ చేశారు .ఒక వేళ కేసు నమోదు చెయ్యకుంటే నిరాహార్ దీక్ష చేస్తానని ప్రకటించారు . ఇక ఇదే సమయంలో వైసీపీ అధినేత జగన్ ఎన్నికల సంఘాన్ని , గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో కోడెలపై కేసు నమోదు అయ్యింది .

 ఇనుమెట్ల ఘటనపై చంద్రబాబుతో స్పీకర్ కోడెల సుదీర్ఘ చర్చ

ఇనుమెట్ల ఘటనపై చంద్రబాబుతో స్పీకర్ కోడెల సుదీర్ఘ చర్చ

ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడితో భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటికి వచ్చిన కోడెల ముఖ్యమంత్రితో ఏకాంతంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లాలో ఇనుమెట్లలో తనపై జరిగిన దాడి ఘటనను ముఖ్యమంత్రికి వివరించారు.

వైసీపీ దాడిని తిప్పికొట్టే వ్యూహంలో టీడీపీ

వైసీపీ దాడిని తిప్పికొట్టే వ్యూహంలో టీడీపీ

ఇనుమెట్లలో రిగ్గింగ్ జరుగుతోందని సమాచారం రావడంతోనే తాను అక్కడకు వెళ్లానని కోడెల తెలిపారు. అయితే తనపై వైసీపీ నేతలు, కార్యకర్తలు అక్కడ దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నేతల దాడిని ఎలా తిప్పికొట్టాలన్న విషయమై ఇద్దరు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. జగన్ నాయకత్వంలో వైసీపీ నేతలు గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేయడంపై కూడా చర్చించారు.

English summary
Speaker Kodela Shivprasadarao of Andhra Pradesh Assembly today met with AP CM Chandrababu Naidu. Kondela came to Chandrababu's house at Undavalli and met with the Chief Minister. On this occasion, Kodela was explainde Inumetla attck to babu . Kodela said he had gone there when he was got to know that the rigging was in progress. However, YCP leaders and activists expressed their disappointment. Two leaders discussed the issue of how to repel the YCP leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X