ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కోడెల భేటీ .. ఇనుమెట్ల ఘటనపై చర్చ
ఏపీ స్పీకర్ గా వ్యవహరించిన కోడెల శివప్రసాదరావుపై రాజుపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు . కోడెలతో పాటు 22 మంది టీడీపీ కార్యకర్తలపైనా కేసు నమోదు చేసిన గుంటూరు జిల్లా రాజుపాలెం పోలీసులు ఈ కేసులో కోడెలను ఏ3గా పేర్కొన్నారు.
ఆ అభియోగాలతోనే ఏపీ స్పీకర్ గా వ్యవహరించిన కోడెలపై కేసు నమోదు
కొత్త మలుపులు తిరుగుతున్న ఇనుమెట్ల ఘటన
కోడెలపై దాడి వ్యవహారంలో మొదట ఇనుమెట్లలో నిందితులను అరెస్ట్ చేసి , కొందరు వైసీపీ నాయకుల మీద కేసులు నమోదు చేశారు పోలీసులు . అయితే ఈ దాడి వ్యవహారంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని పోలింగ్ బూత్ లోపలి వెళ్లి తలుపులు పెట్టుకుని పోలింగ్ బూత్ ను తన అధీనంలోకి తెచ్చుకున్నందుకు కోడెలపై కేసు నమోదు చెయ్యాలని వైసీపీ నేత అంబటి డిమాండ్ చేశారు .ఒక వేళ కేసు నమోదు చెయ్యకుంటే నిరాహార్ దీక్ష చేస్తానని ప్రకటించారు . ఇక ఇదే సమయంలో వైసీపీ అధినేత జగన్ ఎన్నికల సంఘాన్ని , గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో కోడెలపై కేసు నమోదు అయ్యింది .
ఇనుమెట్ల ఘటనపై చంద్రబాబుతో స్పీకర్ కోడెల సుదీర్ఘ చర్చ
ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడితో భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటికి వచ్చిన కోడెల ముఖ్యమంత్రితో ఏకాంతంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లాలో ఇనుమెట్లలో తనపై జరిగిన దాడి ఘటనను ముఖ్యమంత్రికి వివరించారు.
వైసీపీ దాడిని తిప్పికొట్టే వ్యూహంలో టీడీపీ
ఇనుమెట్లలో రిగ్గింగ్ జరుగుతోందని సమాచారం రావడంతోనే తాను అక్కడకు వెళ్లానని కోడెల తెలిపారు. అయితే తనపై వైసీపీ నేతలు, కార్యకర్తలు అక్కడ దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నేతల దాడిని ఎలా తిప్పికొట్టాలన్న విషయమై ఇద్దరు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. జగన్ నాయకత్వంలో వైసీపీ నేతలు గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేయడంపై కూడా చర్చించారు.