సైకిల్ ర్యాలీలో అపశృతి: బైక్ ఢీ, కోడెలకు స్వల్ప గాయాలు
గుంటూరు: ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శుక్రవారం చేపట్టనున్న దీక్షకు మద్దతుగా శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు గురువారం చేపట్టిన యాత్రలో అపశృతి చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా నరసరావుపేటలోని తన నివాసం నుంచి కోటప్పకొండకు గురువారం ఉదయం కోడెల సైకిల్పై బయల్దేరారు.
మార్గమధ్యంలో అనేక చోట్ల నేతలు కార్యకర్తలు కోడెలకు ఘన స్వాగతం పలికారు. ఆయన సైకిల్ యాత్ర కొనసాగుతున్న సమయంలో ఒక్కసారిగా అపశృతి చోటు చేసుకుంది. యలమంద వద్ద ఓ ద్విచక్రవాహనదారుడు అదుపుతప్పి స్పీకర్ కోడెల్ సైకిల్ను ఢీకొట్టాడు.

దీంతో కోడెల శివప్రసాద్ సైకిల్పై నుంచి కిందపడ్డారు. పక్కనే ఉన్న నేతలంతా కోడెలను వెంటనే పైకి లేపి ప్రథమ చికిత్స అందించారు. ఈ ఘటనలో కోడెల తలకు స్వల్పగాయాలయ్యాయి. కాసేపు సేద తీరిన తర్వాత కోడెల తన సైకిల్ యాత్రను కొనసాగించారు.
More From
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications