వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కారు ప్రమాదం: బయటపడ్డ ఎంపీలు గీత, బుట్టా

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులు కొత్తపల్లి గీత, బుట్టా రేణుక బుధవారం రాత్రి కారు ప్రమాదానికి గురయ్యారు. ఇద్దరు ఎంపీలు పార్లమెంటు సమావేశం ముగిసిన అనంతరం వారు విడిదిచేసిన అశోకా హోటల్‌కు చేరుకుంటున్న సమయంలో పక్క సందులో నుండి ఒక ట్యాక్సీ వేగంగా వచ్చి వారి కారును ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఇద్దరు ఎంపీలు సురక్షితం బైటపడినా బుట్టా రేణుకకు చెందిన ఆడీ ఎస్‌యువి కారు బాగా దెబ్బతింది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని మధ్యప్రదేశ్‌కు చెందిన ట్యాక్సీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Kothapalli Geetha escapes death in Delhi!

వైయస్సార్ కాంగ్రెస్ అధినాయకత్వంతో తగాదాపడిన ఇద్దరు ఎంపీలు ప్రయాణిస్తున్న కారును ట్యాక్సీ ఢీకొట్టటం యాదృచ్చికంగా జరిగిందా లేక ఏదైనా దురుద్దేశంతో కూడుకున్నదా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తాము అశోకా హోటల్‌కు చేరుకుంటున్న సమయంలో సందులో నుంచి ఓ ట్యాక్సీ అమితవేగంగా దూసుకొవచ్చి తాను కూర్చున్న వైపు ఢీకొట్టిందని గీత మీడియాకు తెలిపారు. ఆడీ కారు కాకుండా మరో కారైతే తాము బతికేవాళ్లము కాదని గీత చెప్పారు. పోలీసు దర్యాప్తులో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని ఆమె అన్నారు.

English summary
YSRCP leaders were turning victims of road accidents.The party MP from Araku Kothapalli Geetha , who was in news for last few days over facebook abuses , has escaped a serious accident in Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X