బంజారాహిల్స్లో 3.7 ఎకరాలు స్వాహాకు ప్లాన్: ఏపీ టీడీపీ నేత దీపక్పై కేసు
హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్లో భూ ఆక్రమణకు యత్నించిన అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ నేత దీపక్రెడ్డిపై హైదరాబాద్ సెంట్రల్క్రైమ్ స్టేషన్లో కేసు నమోదైంది.
హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్లో భూ ఆక్రమణకు యత్నించిన అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ నేత దీపక్రెడ్డిపై హైదరాబాద్ సెంట్రల్క్రైమ్ స్టేషన్లో కేసు నమోదైంది. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబరు2లో 3.37ఎకరాల భూమి తమదేనంటూ తప్పుడు పత్రాలు సృష్టించారన్న అభియోగాలపై పోలీసులు విచారణ చేపట్టారు.
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్లో దశాబ్దాల క్రితం నివాసమున్న అయూబ్ కమల్ అనే శరణార్థికి చెందిన 3.37ఎకరాల భూమిని 1960లో ఎంవీఎస్ చౌదరి అండ్ బ్రదర్స్ కొనుగోలు చేశారు. అప్పటి నుంచి ఈ భూమి వారి ఆధీనంలోనే ఉంది. ఈ భూమిని అయూబ్ కమలే వేరే ఇద్దరు వ్యక్తులకు విక్రయించినట్టు, అటు పై వారు తమకు అమ్మినట్టు జైహనుమాన్ ట్రేడర్స్, దీపక్రెడ్డిలు నకిలీ పత్రాలు సృష్టించారు.
అనంతరం తమ భూమిని కబ్జా చేశారంటూ ఎంవీఎస్ చౌదరి అండ్ బ్రదర్స్పై జైహనుమాన్ ట్రేడర్స్ యజమాని కుమారుడు, ప్రధాన నిందితుడు శైలేంద్ర సక్సేనా భూకబ్జా నిరోధక కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారణ సందర్భంగా ఎంవీఎస్ చౌదరి తరఫు ప్రతినిధి రాధాకృష్ణమూర్తి రెవెన్యూ అధికారులు ధ్రువీకరించిన పత్రాలను కోర్టులో సమర్పించారు.

కొద్దిరోజుల కిందట ఆయన బంజారాహిల్స్ పోలీస్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా... పోలీస్ అధికారులు ఈ కేసును సీసీఎస్కు బదిలీ చేశారు. ఫిబ్రవరి 7న ఆర్థికనేరాల విభాగం శైలేంద్ర సక్సేనా తదితరులతో పాటు ఎ5గా దీపక్రెడ్డిపై కేసు నమోదు చేసింది.ఈ కేసులో ఏ5గా దీపక్రెడ్డి ఉన్నారని సీసీఎస్ అధికారులు తెలిపారు.
కాగా, ప్రాథమిక విచారణలో ప్రధాన నిందితుడు శైలేంద్ర సక్సేనా తప్పుడు పత్రాలు సమర్పించారని ఆధారాలు లభించడంతో ఆయన్ను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశామన్నారు. చట్టప్రకారం దీపక్రెడ్డిపైనా చర్యలు తీసుకుంటామని డీసీపీ(క్రైం)అవినాశ్ మహంతి స్పష్టం చేశారు.
-
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..












Click it and Unblock the Notifications