Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కీలక నేతలపై నాన్ లోకల్ ఎఫెక్ట్ - ఫలితం మార్పు, 2014 రిపీట్..!!

ఏపీ ఎన్నికల్లో కీలక పరిణామాలు తెర మీదకు వస్తున్నాయి. ప్రతీ నియోజకవర్గంలో పోటీ నువ్వా నేనా అన్నట్లుగా మారుతోంది. జగన్, చంద్రబాబు, పవన్ ప్రచారం హోరెత్తిస్తున్నారు. ప్రత్యర్ధుల పైన పై చేయి సాధించటానికి ఏ ఒక్క అవకాశం వదులుకోవటం లేదు. ఈ సమయంలోనే అనూహ్యంగా లోకల్ - నాన్ లోకల్ అంశం పలు నియోజకవర్గాల్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ గా మారుతోంది. దీంతో..ముఖ్య నేతల్లో గుబులు మొదలైంది.

స్థానికత అంశం
ఏపీలో ఈ సారి ఎన్నికల్లో మరో కీలక అంశం ప్రచార అస్త్రంగా మారుతోంది. లోకల్ - నాన్ లోకల్ అంశం ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలోనూ ఇదే అంశం పైన చర్చ సాగుతోది. ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిచిన వంగా గీత పిఠాపురంకు లోకల్ గా... గతంలో భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసి ఓడిన పవన్ నాన్ లోకల్ గా ప్రచారం జరుగుతోంది. వంగా గీతను పరిచయం చేసే సమయంలోనూ సీఎం జగన్ ఇదే అంశం ప్రస్తావించారు. లోకల్ హీరో కావాలా..సినిమా హీరో కావాలా ఆలోచించాలని సూచించారు. మంగళగిరిలో బీసీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న నాన్ లోకల్ లోకేష్ ... లోకల్ బీసీ వర్గాలకు చెందిన లావణ్య కు మధ్య పోటీ జరుగుతుందని చెప్పుకొచ్చారు.

Local - Non Local factor becomes interesting factor in AP Elections impacts on key leaders

ముఖ్య నేతలపై ప్రభావం
బీజేపీ నుంచి అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ కడప జిల్లా వాసి. మాడుగుల ఎమ్మెల్యేగా ఉన్న బూడి ముత్యాల నాయుడు వైసీపీ నుంచి ఎంపీ అభ్యర్దిగా ఉన్నారు. అక్కడ లోకల్ - నాల్ లోకల్ అంశం ప్రచారంలో ఉంది. ఏలూరు నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న కూటమి అభ్యర్ది పుత్తా మహేష్ యాదవ్ పోటీలో ఉన్నారు. మహేష్ కూడా కడప జిల్లాకు చెందిన వారే. నర్సరావు పేట నంచి పోటీ చేస్తన్న వైసీపీ ఎంపీ అభ్యర్ది అనిల్ కుమార్ యాదవ్ సైతం నాన్ లోకల్ విమర్శలు ఎదుర్కొంటున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన అనిల్ నర్సరావు పేట నుంచి పోటీలో ఉన్నారు. ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్దిగా పోటీ చేస్తున్న చెవిరెడ్డి భాస్కర రెడ్డి చిత్తూరు జిల్లా వాసి. ఇదే తరహాలో మరి కొందరు ఎమ్మెల్యే అభ్యర్దులు ఉన్నారు.

Local - Non Local factor becomes interesting factor in AP Elections impacts on key leaders

ఫలితం మార్చేస్తుందా
లోకల్ - నాన్ లోకల్ ప్రచారం సాగుతున్న వేళ 2014 ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న అంశాలను పలువురు గుర్తు చేస్తున్నారు. నాడు విశాఖ ఎంపీగా జగన్ తల్లి విజయమ్మ పోటీ చేసారు. ఆ సమయంలో టీడీపీ కూటమి లోకల్ అంశాన్ని ప్రధానంగా తమ ప్రచార అస్త్రంగా మలచుకుంది. కడప జిల్లా వారు విశాఖలో గెలిస్తే ఇబ్బందులు వస్తాయని ప్రచారం చేసారు. ఫలితంగా విజయమ్మ ఓడిపోయారు. దీంతో, ఇప్పుడు కడప జిల్లాకు చెందిన వారే కూటమి నుంచి అనకాపల్లి, ఏలూరు నుంచి ఎంపీ అభ్యర్దులుగా పోటీ చేస్తున్నారు. స్థానికత అంశం కీలకంగా మారుతోంది. దీంతో..కూటమి, వైసీపీ నుంచి సొంత జిల్లాలు కాకుండా ఇతర జిల్లాల్లో పోటీ చేస్తున్న వారి పైన ఈ అంశం ఎలాంటి ప్రభావం చూపిస్తుందనే ఉత్కంఠ కొనసాగుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+