పురంధేశ్వరి సహా సీమాంధ్రలో ఓడిన ప్రముఖులు
హైదరాబాద్: సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకు పోతోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పోటీనిచ్చినప్పటికీ వెనుకబడింది. తెలుగుదేశం పార్టీ వంద సీట్ల వరకు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ డెబ్బై సీట్ల వరకు గెలుచుకునే అవకాశం కనిపిస్తోంది. సీమాంధ్రలో పలువురు ప్రముఖులు ఓటమి చెందారు.
సీమాంధ్రలో ఓడిపోయిన ప్రముఖులు
ఒంగోలులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఓడిపోయారు. ఆయన టిడిపి నేత దామరచర్ల జనార్ధన్ చేతిలో ఓఢిపోయారు.
గంగాధర నెల్లూరులో కుతూహలమ్మ ఓటమి
దర్శి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి శివప్రసాద్ రెడ్డి
మాజీ మంత్రి రఘువీరా రెడ్డి ఓటమి
శ్రీకాకుళంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావు
చీపురుపల్లి నుండి కాంగ్రెస్ అభ్యర్థి బొత్స సత్యనారాయణ
చంద్రగిరి టిడిపి అభ్యర్థి గల్లా అరుణ కుమారి
తెనాలి నుండి కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్
నగరి నుండి గాలి ముద్దుకృష్ణమ నాయుడు. రోజా చేతిలో 868 ఓట్ల తేడాతో గెలుపొందారు.
తంబళ్లపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ రెడ్డి. ఆయన టిడిపి నుండి జగన్ పార్టీలో చేరారు.
సర్వేపల్లి నుండి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
ఉరవకొండ నుండి పయ్యావుల కేశవ్
మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
సీమాంధ్రలో 9 మంది మంత్రులు ఓటమి... రఘువీరా, బొత్స, ధర్మాన, కొండ్రు, ఆనం రామనారాయణ రెడ్డి, శైలజానాథ్, ఏరాసు ప్రతాప్ రెడ్డి, గల్లా అరుణ కుమారి, టిజి వెంకటేష్
విజయనగరం నుండి బొత్స ఝాన్సీ
సీమాంధ్రకు చెందిన మాజీ కేంద్రమంత్రులు పనబాక లక్ష్మి, కిల్లి కృపారాణి, పళ్లం రాజు, పురంధేశ్వరి, కిశోర్ చంద్రదేవ్, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిలు ఓటమి పాలయ్యారు.