పెళ్ళయ్యాక ప్రేమించుకొన్నారు, కలిసి చనిపోతామంటూ ఇలా...
కలిసి బతకాలనుకొన్న ప్రేమికులు .... సాధ్యం కాకపోవడంతో కలిసి చనిపోతామంటూ లేఖ రాసి వెళ్ళిపోయారు. వారి కోసం పోలీసులు, కుటుంబసభ్యులు గాలిస్తున్నారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకొంది.
గుంటూరు: కలిసి బతకాలనుకొన్న ప్రేమికులు .... సాధ్యం కాకపోవడంతో కలిసి చనిపోతామంటూ లేఖ రాసి వెళ్ళిపోయారు. వారి కోసం పోలీసులు, కుటుంబసభ్యులు గాలిస్తున్నారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకొంది.
గుంటూరు జిల్లా స్వర్ణభారతినగర్కు చెందిన మహిళకు ఐదేళ్ళ క్రితం వివాహమైంది. ఆమెకు ఇద్దరు పిల్లలు. నగరాలుకు చెందిన ఆటో డ్రైవర్ గోపికి ఏడేళ్ళ క్రితం వివాహమైంది. ఆయనకు కూడ ఇద్దరు పిల్లలు. ఏడాది కాలంగా వీరిద్దరి మధ్య ప్రేమ ఏర్పడింది.
రెండు కుటుంబాలకు చెందిన వారికి వీరి ప్రవర్తనపై అనుమానం వచ్చింది. ఇద్దరిని హెచ్చరించారు. కానీ, వారి ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో ఇద్దరూ కలిసి ఇంటి నుండి పారిపోవాలని నిర్ణయం తీసుకొన్నారు.
ఆదివారం నాడు ఉత్తరాలు రాసి ఇద్దరు ప్రేమికులు ఇండ్ల నుండి పారిపోయారు. కలిసి బతకాలనుకొన్నాం. కానీ, అది సాద్యపడదని తెలుసు. అందుకే కనీసం కలిసి చనిపోవాలని నిర్ణయించుకొన్నాం. మా మృతదేహల కోసం ఎవరూ గాలించకూడదని వారు లేఖలు రాసి ఎటో వెళ్ళిపోయారు.
ఈ ఘటన గుంటూరు జిల్లాలోని నల్లపాడు పోలీస్స్టేషన్లో చోటుచేసుకొంది. రెండు కుటుంబాలకు చెందిన వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆదారంగా పోలీసులు గాలింపు చర్యలను చేపట్టారు.