హామీలకు కట్టుబడి ఉండాలి: బాబుకు పవన్ కళ్యాణ్, జనసేనానిని కలిసిన కాంగ్రెస్ నేత
హైదరాబాద్/అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ఏపీ మత్స్యకారుల సంఘాలు సోమవారం కలిశాయి. పుదుచ్చేరి కాంగ్రెస్ నేత మల్లాడి కృష్ణారావు ఆధ్వర్యంలో వారి సమస్యలను జనసేనాని దృష్టికి తీసుకు వెళ్లారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడారు. మత్స్యకారుల సమస్యను పార్టీలకు అతీతంగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. మల్లాడి, కాంగ్రెస్ నేత అని, ఆయనకు ప్రజా సమస్యలపై నిబద్దత ఉందన్నారు. ఇలాంటి వారు ఎవరైనా తాను పార్టీలకు అతీతంగా ఉంటానని అభిప్రాయపడ్డారు.

కేవలం ప్రజా సంక్షేమం గురించి పరితపించే వ్యక్తి మల్లాడి అన్నారు. మత్స్యకారులు ఎస్టీ జాబితాలో ఉండాలన్నారు. మత్స్యకారుల సమస్యలు తనకు తెలుసునని చెప్పారు. వారిని ఎస్టీల్లో చేర్చే ఉద్యమానికి అండగా ఉంటానని, వారి దీక్షను అడ్డుకోవడం సరికాదన్నారు.
శాంతియుత దీక్షలను అడ్డుకోవద్దన్నారు. మత్స్యకారులను ఎస్టీలో చేర్చుతామని చంద్రబాబు, టీడీపీ మేనిఫెస్టోలో పెట్టింది కాబట్టి దానిని పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఎన్నికల ప్రచార సమయంలో మేనిఫెస్టోలో పెట్టినప్పుడు దానికి కట్టుబడి ఉండాలన్నారు.
కమిటీ వేసి, పార్లమెంటు దృష్టికి తీసుకు వెళ్లి, మత్స్యకారులకు భరోసా ఇవ్వాలన్నారు. తాను ప్రధాని మోడీని కలిసినప్పుడు ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకు వెళ్తానని చెప్పారు. తీర ప్రాంతాల్లో కాలుష్యంతో మత్స్యకారులు ఇబ్బందిపడుతున్నారన్నారు.
-
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
ఉస్తాద్ భగత్ సింగ్ కాస్ట్లీ మిస్టేక్.. !! -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications