భార్య ముక్కు కొరికిన భర్త: భార్యని చంపి కాల్చేసిన భర్త
గొడవలో కోపం పట్టలేని భర్త భార్య ముక్కు కొరికేశాడు. దాంతో ఆమె బాధతో కేకలు వేసింది. వెంటనే పక్కనే ఉన్న కార్మికులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. వారిని చూసి బాలకృష్ణయ్య పారిపోయాడు. బాధితురాలిని తాండూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. ఆ తర్వాత హైదరాబాదులోని ఆస్పత్రికి ఆమెను తరలించారు.
హైదరాబాదులోని ఎల్బీనగర్ సాయినగర్లో ఓ యువకుడు దారుణమైన హత్యకు గురయ్యాడు. గురువారం తెల్లవారు జామున రవి అనే యువకుడు హత్యకు గురయ్యాడు. ఇంటి ముందు మంచంపై పడుకున్న రవి (26)ని గుర్తు తెలియని వ్యక్తులు రాయితో మోది హత్య చేశారు. ఆ తర్వాత శవాన్ని ఇంటి సమీపంలో పడేశారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని జలవిహార్ వద్ద ద్విచక్రవాహనం ఒక్కటి పారిశుధ్య కార్మికుడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు.
కాగా, కృష్ణా జిల్లాలో దారుణ సంఘటన జరిగింది. గుడివాడ మండలం దొండపాడు గ్రామంలో ఓ భర్త తన భార్యను హత్య చేసి మృతదేహాన్ని బాత్రూంలో పడేసి కాల్చేశాడు. స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.