Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీలో కల్తీ మ‌ద్యం తాగి వైన్ షాపులోనే వ్య‌క్తి మృతి..?

ఆంధ్రప్రదేశ్, ఏలూరు నగరంలో చోటు చేసుకున్న ఓ అమానుష ఘటన ఇప్పుడు తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి వైన్ షాపులోనే కుప్పకూలి మరణించినా, దాన్ని పట్టించుకోకుండా యథావిధిగా మద్యం అమ్మకాలు కొనసాగించడం మానవత్వానికే సవాలు విసిరింది.

ఏలూరులోని జీవీ మాల్ (GV Mall) వద్ద ఉన్న SR వైన్స్ షాపు (SR Wines) లో ఈ దారుణం జరిగింది. మద్యం సేవించిన ఒక వ్యక్తి అపస్మారక స్థితిలోకి వెళ్లి, అక్కడే పడిపోయి మరణించాడు. మృతదేహం కళ్లముందే ఉన్నా, షాపు నిర్వహకులు గానీ, అక్కడ ఉన్న ఇతర కస్టమర్లు గానీ పట్టించుకున్న పాపాన పోలేదు.

Man Dies in Wine Shop Sales Continue Next to Body YCP Alleges Death Due to Spurious Liquor

ఈ షాకింగ్ ఘటనలో, ఆ మృతదేహం అక్కడే పడి ఉన్నప్పటికీ, షాపు నిర్వాహకులు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తమ వ్యాపారాన్ని యథావిధిగా కొనసాగించారు. మద్యాన్ని కొనుగోలు చేయడానికి వచ్చిన వారు కూడా ఆ శవాన్ని చూసినా, ఏమీ జరగనట్టుగా మద్యం తీసుకుని వెళ్లిపోయారు.

చనిపోయిన వ్యక్తి ఎవరు, ఎక్కడివాడు అనే వివరాలు తెలియరాలేదు. కనీసం పోలీసులకు సమాచారం ఇవ్వకుండా, గంటల తరబడి మృతదేహాన్ని అలాగే ఉంచడం ఈ ఘటనలోని అత్యంత దారుణమైన విషయం. ఈ అమానవీయ ఘటన, మద్యం వ్యాపారంలో నైతిక విలువల పతనాన్ని, సమాజంలో పెరిగిన ఉదాసీనతను కళ్లకు కట్టినట్టు చూపించింది.

ఈ విషయంపై పోలీసులు ఏ చర్యలు తీసుకున్నారు, వైన్ షాపు నిర్వాహకులపై ఏ కేసు నమోదు చేశారు అనే వివరాలు తెలియాల్సి ఉంది.అయితే నకిలీ మద్యం తాగడం వల్లే వ్యక్తి మృతి చెందారని స్థానిక వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ మృతికి కూడా ప్రభుత్వమే కారణమని విమర్శలు చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+