సోనియాకు బెయిల్: తిరుమలేశుడికి వేలు కానుక, అంబరీష్ అభినందన
బెంగళూరు: మహాభారతంలో ఏకలవ్యుడు ద్రోణాచారుడికి గురుదక్షిణ కింద తన బొటన వేలిని కోసి ఇచ్చిన కథ అందరికీ తెలిసిందే. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు బెయిలు లభించినందుకు కర్ణాటకలో ఓ ఆధునిక ఏకలవ్యుడు తన చిటికెన వేలును నరికి తిరుపతి వెంకటేశ్వరుడికి కానుకగా ఇచ్చుకున్నాడు.
బెంగళూరు సమీపంలోని రామనగరకు చెందిన ఇందువల సురేశ్ అనే 35 ఏళ్ల యువకుడు గత నెల 25న తిరుపతి వెంకన్న ఆలయానికి వెళ్లి తన చిటికెన వేలును వెయ్యి రూపాయల నోటులో చుట్టి ఆలయంలోని హుండీలో వేశాడని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా' పత్రిక రాసింది.

"మొత్తం కాంగ్రెస్ పార్టీ ఆందోళనలో ఉండింది. అందుకే నేను ఈ కేసులో సోనియా, ఆమె కుమారుడు రాహుల్కు బెయిలు లభిస్తే నా చిటికెన వేలును కానుకగా ఇస్తానని మొక్కుకొన్నా" అని సురేశ్ చెప్పాడు.
ఈ వార్త కాస్తా కర్నాటక హౌసింగ్ మంత్రి ఎంహెచ్ అంబరీష్ చెవిన పడింది. దాంతో ఆయన సురేశ్ను జెపి నగర్లోని తన ఇంటికి పిలిపించుకుని అభినందించారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!












Click it and Unblock the Notifications