వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోనియాకు బెయిల్: తిరుమలేశుడికి వేలు కానుక, అంబరీష్ అభినందన

By Pratap
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: మహాభారతంలో ఏకలవ్యుడు ద్రోణాచారుడికి గురుదక్షిణ కింద తన బొటన వేలిని కోసి ఇచ్చిన కథ అందరికీ తెలిసిందే. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు బెయిలు లభించినందుకు కర్ణాటకలో ఓ ఆధునిక ఏకలవ్యుడు తన చిటికెన వేలును నరికి తిరుపతి వెంకటేశ్వరుడికి కానుకగా ఇచ్చుకున్నాడు.

బెంగళూరు సమీపంలోని రామనగరకు చెందిన ఇందువల సురేశ్ అనే 35 ఏళ్ల యువకుడు గత నెల 25న తిరుపతి వెంకన్న ఆలయానికి వెళ్లి తన చిటికెన వేలును వెయ్యి రూపాయల నోటులో చుట్టి ఆలయంలోని హుండీలో వేశాడని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా' పత్రిక రాసింది.

Man 'donates' finger at Tirupati as thanks for bail to Sonia and Rahul Gandhi

"మొత్తం కాంగ్రెస్ పార్టీ ఆందోళనలో ఉండింది. అందుకే నేను ఈ కేసులో సోనియా, ఆమె కుమారుడు రాహుల్‌కు బెయిలు లభిస్తే నా చిటికెన వేలును కానుకగా ఇస్తానని మొక్కుకొన్నా" అని సురేశ్ చెప్పాడు.

ఈ వార్త కాస్తా కర్నాటక హౌసింగ్ మంత్రి ఎంహెచ్ అంబరీష్ చెవిన పడింది. దాంతో ఆయన సురేశ్‌ను జెపి నగర్‌లోని తన ఇంటికి పిలిపించుకుని అభినందించారు.

English summary
Suresh, a 35-year-old granite businessman from Ramanagaram, 60 kilometres from Bengaluru, is now being hailed as Congress Ekalavya (after the archer Eklavya in Mahabharata, who sacrificed his right thumb for Guru Dronacharya), after he cut his left hand's little finger as an offering to the Tirupati hundi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X