ప్రేమించి పెళ్లి చేసుకోలేదని ఆమెను తగులబెట్టాడు

ఈ ప్రాంతానికి చెందిన శివలక్ష్మమ్మ అనే యువతి మంగళవార రాత్రి నుంచి కనిపించడంలేదని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కొంత సేపటికి పట్టణ శివారు ప్రాంతంలో ఓ మృతదేహం కాలి పడివున్నట్టు స్థానికులు గుర్తించి, పోలీసులకు సమాచారం చేరవేశారు.
దీంతో యువతి తల్లిదండ్రులను వెంటబెట్టుకుని మృతదేహం వద్దకు వెళ్లగా ఆ శవం శివలక్ష్మదిగా గుర్తించారు. తనను ప్రేమించి వేరొకరిని పెళ్ళి చేసుకుంటోందన్న అక్కసుతోనే వావిద్ ఆమెను హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టినట్టు తెలుస్తోంది.
స్థానికంగా ఈ సంఘటన కలకలం సృష్టించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications