టిడిపిలోకి మండలి: కర్నూలు నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు

మండలి బుద్ధప్రసాద్ అవనిగడ్డ శాసనసభా స్థానాన్ని ఆశిస్తున్నారు. ప్రస్తుతం ఈ సీటుకు అంబటి రమేష్ తెలుగుదేశం సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మండలి బుద్ధప్రసాద్ను తీసుకోవాలనే ఆలోచనను అవనిగడ్డ నాయకులు కొంత మంది వ్యతిరేకిస్తున్నారు. ఆ నియోజకవర్గంలోని మండల కమిటీ అధ్యక్షులు శుక్రవారం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని కలిసి దీనిపై మాట్లాడారు.
కర్నూలు నుంచి మరో ఇద్దరు..
కర్నూలు జిల్లాలో మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ చేరేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. నంద్యాల ఎమ్మెల్యే శిల్పామోహన్రెడ్డి ముందుగానే కాంగ్రెస్కు గుడ్బై చెప్పి తెలుగుదేశం పార్టీలో బెర్త్ రిజర్వ్ చేసుకున్నారు. పాణ్యం శాసనసభ్యుడు కాటసాని రాంభూపాల్రెడ్డి టిడిపి టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈమేరకు జిల్లాకు చెందిన తెలుగుదేశం సీనియర్ నేత కెఇ కృష్ణమూర్తితోను, పార్టీ ముఖ్య నేతలతో మంతనాలు జరిపినట్లు సమాచారం. టీడీపీ అధినేత చంద్రబాబుతో కూడా రాంభూపాల్రెడ్డి తన సీటు విషయం చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం.
సీట్ల సర్దుబాటు విషయంలో చంద్రబాబు ఇంకా ఏరాసు, కాటసాని విషయాలను పరిశీలనలో ఉంచినట్లు తెలుస్తుంది. తన స్వగ్రామం పాణ్యం నియోజకవర్గం గడివేముల కావడంతో తనకు ఆ సీటు కావాలంటూ ఏరాసు పట్టుపడుతున్నారు. కానీ సిటింగ్ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి తాను పాణ్యం తప్ప మరోచోట నుంచి పోటీ చేయబోనని స్పష్టం చేసినట్లు సమాచారం.
అయితే, రాబోయే ఎన్నికల్లో నంద్యాల లోక్సభ స్థానానికి మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్రెడ్డిని బరిలోకి దించితే సునాయసంగా విజయం సాధించవచ్చనే ఆలోచనతో తెలుగుదేశం పార్టీ ఉన్నట్లు సమాచారం.
12న గంటా చేరిక?
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి ఎనిమిదిన విశాఖలో నిర్వహించ తలపెట్టిన మహిళా సదస్సును తెలుగుదేశం పార్టీ హైదరాబాద్లోనే ఏర్పాటుచేయనుంది. కాగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, మిగిలిన నలుగురు శాసనసభ్యులు 12న తెలుగుదేశంలో చేరనున్నట్టు తెలిసింది.
-
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..??












Click it and Unblock the Notifications