మంగళంపల్లి బాలమురళీకృష్ణ జయంతి : జగన్ సర్కార్ ను టార్గెట్ చేసిన చంద్రబాబు, లోకేష్ లు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏపీలో అధికారంలో ఉన్న వైసిపి సర్కార్ ను టార్గెట్ చేశారు. అభినవ వాగ్గేయకారుడు సంగీత సామ్రాట్ పద్మవిభూషణ్ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ జయంతిని ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వేడుకగా జరపాలని గత టీడీపీ హయాంలో నిర్ణయించామని, దానిని అమలు చేశామని, కానీ జగన్ సర్కార్ ప్రస్తుతం ఆ ఆనవాయితీని కొనసాగించటం లేదంటూ ట్విట్టర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు.

బాలమురళీకృష్ణ జయంతిని ప్రభుత్వ హయాంలో జరపటం లేదని ఆవేదన
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ జయంతిని ప్రభుత్వ హయాంలో జరపామని, కానీ ప్రస్తుత ప్రభుత్వం ఆ పని చేయడం లేదని సోషల్ మీడియా వేదికగా ప్రస్తావించారు. సంగీత కళానిధి మంగళంపల్లి బాలమురళీకృష్ణ తెలుగువారందరికీ గర్వకారణం అయిన కళాకారుడని, ఆ గాయక శిఖామణి గౌరవార్థం బాలమురళీకృష్ణ గారి జయంతిని ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వేడుకగా ప్రకటించి అమలు చేశామని చంద్రబాబు పేర్కొన్నారు.

టీడీపీ హయాంలో మంగళంపల్లి జయంతి వేడుకలు ఘనంగా
గుంటూరులోని ప్రభుత్వ సంగీత,నాట్య కళాశాలకు బాలమురళీకృష్ణ గారి పేరును పెట్టామని అలాగే ప్రతి ఏటా సంగీత నిష్ణాతులకు బాలమురళీకృష్ణ పేరుతో అవార్డు ఇవ్వాలని, సంగీతం నేర్చుకునే ప్రతిభగల విద్యార్థులకు స్కాలర్షిప్ లు ఇవ్వాలని ఉత్తర్వులు ఇచ్చామని చంద్రబాబు వెల్లడించారు. బాలమురళీకృష్ణ గారిచే రచించబడిన 300 సంకీర్తనలను రికార్డ్ చేయించాలని ప్రణాళికలు వేశామని ఈ ప్రభుత్వంలో ఆ కార్యక్రమాలేవీ జరగకపోవడం బాధగా ఉందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

జగన్ సర్కార్ కనీసం పట్టించుకోకపోవడం మనోవేదనకు గురి చేస్తుందన్న లోకేష్
ఈరోజు బాలమురళీకృష్ణ గారి జయంతి సందర్భంగా వారి కళా సేవ స్మరించుకుంటూ ఆ కళా భూషణుడి స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను అంటూ చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్ర వేడుకగా జరగాల్సిన మంగళంపల్లి బాలమురళీకృష్ణ జయంతి ఉత్సవాన్ని ప్రస్తుత జగన్ సర్కార్ కనీసం పట్టించుకోకపోవడం మనోవేదనకు గురి చేస్తుందని నారా లోకేష్ పేర్కొన్నారు.ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులు అర్పిస్తున్నా అని పేర్కొన్నారు లోకేష్ .

మన మహనీయులను మనమే గౌరవించుకోవాలి జగన్ రెడ్డి
గత టీడీపీ ప్రభుత్వంలో మంగళం పల్లి వారి జయంతిని ప్రభుత్వ కార్యక్రమం గా నిర్ణయించి, గుంటూరు సంగీత కళాశాలకు వారి పేరు పెట్టి, అనేక సాంస్కృతిక కార్యక్రమాలు వారి పేరుమీద నిర్వహించామని తెలిపారు. కానీ నేటి సర్కార్ దాన్ని పట్టించుకోకపోవడం అంటే మళ్లీ మనమే అవమానించుకున్నట్లు అంటూ ప్రముఖ వాగ్గేయకారుడిని గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఈ సందర్భంగా జగన్ రెడ్డి గారు మన మహనీయులను మనమే గౌరవించుకోవాలి అనేది కాస్త తెలుసుకోండి అంటూ పేర్కొన్న నారా లోకేష్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి జయంతి ఉత్సవాలను ప్రభుత్వం నిర్వహించే విధంగా చర్యలు తీసుకోండి అంటూ జగన్ కు విజ్ఞప్తి చేశారు.
-
కుమార్తెకు లోకేష్ ఊహించని పెళ్లి గిఫ్ట్ -అవాక్కైన టీడీపీ ఎమ్మెల్యే..! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!












Click it and Unblock the Notifications