జగన్ కు షాకిచ్చే విషయం చెప్పిన మంత్రి అచ్చెన్నాయుడు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి చంద్రబాబు పాలన సాగుతుందని అన్నారు రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు. గత ప్రభుత్వ పరిపాలనా విధానాల కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నప్పటికీ, ప్రభుత్వ ఉద్యోగులకు, నిర్ణీత సమయంలో జీతాలు చెల్లిస్తున్నామన్నారు. అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అనుసరించిన పరిపాలన విధానాలే కారణమన్నారు మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఇదే సమయంలో జగన్ పై బాంబు పేల్చారు.
ఉద్యోగులు ప్రభుత్వానికి అండగా ఉండటం ముదావహం
రాష్ట్ర ఎన్జీవో సంఘం బాధ్యులు మార్క్ఫెడ్ కార్యాలయంలో మంత్రి అచ్చెన్నాయుడును కలిసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అపారమైన ఆదరాభిమానాలు ఉన్నాయ న్నారు. గడచిన ఐదేళ్లలో ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో మానసిక ఒత్తిడిని, అవమానాలను భరించి ప్రస్తుత ప్రభుత్వానికి అండగా నిలవడం ముదావహం అన్నారు.

మీరే ప్రభుత్వంలో కీలకం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి ప్రభుత్వ ఖజానాలో ఒక్క రూపాయి కూడా నిల్వ లేనప్పటికీ, ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం అందరికీ న్యాయం చేసేందుకు చంద్రబాబు కష్టపడుతున్నారని, ప్రజలు కూడా తమ వంతు సాయం అందించారని, ఇది రాష్ట్ర అభివృద్ధికి శుభ పరిణామం అని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు అంటే ప్రభుత్వంలో ఎంతో కీలకమని ముఖ్యమంత్రి పలు సందర్భాలలో చెప్పారని, ప్రభుత్వానికి మీ సంపూర్ణ సహకారం అందించాలన్నారు.
గతంలో ఉద్యోగుల గోడు కూడా వినని పాలన
ఉద్యోగ సంఘాల నాయకులు గతంలో తమ సమస్యలను చెప్పుకునేందుకు కూడా అవకాశం లేని దౌర్భాగ్య పరిస్థితులు ఇకముందు ఉండవన్నారు. ప్రభుత్వంలోని ప్రతి మంత్రి ఉద్యోగుల సమస్యలను వినడంతో పాటు ప్రతి సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి సత్వర పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. అంతిమంగా రాష్ట్ర పురోభివృద్ధి లక్ష్యంగా ఉద్యోగులు, ప్రభుత్వం సుహృద్భావ వాతావరణంలో కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు.
వైసీపీ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంపై ఆయా శాఖలలో విచారణ
గత ప్రభుత్వంలో జరిగిన ఆర్థిక విధ్వంసంపై ఆయా శాఖలలో విచారణ కొనసాగుతోందని, రాష్ట్రానికి నష్టం కలిగించిన ప్రతి ఒక్కరిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలిపారు. ఎన్నికల హామీలో భాగంగా ఉద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకునేందుకు ముఖ్యమంత్రికి మనం అవకాశం ఉన్నంత మేరకు సహకరించి రానున్న 5 ఏళ్లలో అత్యంత వేగవంతమైన అభివృద్ధి సాధించేందుకు పునరంకితం కావాలన్నారు మంత్రి అచ్చెన్నాయుడు.
-
పట్టు చిక్కుతున్న వేళ చంద్రబాబు చేతికి జగన్ మరో అస్త్రం, సెల్ఫ్ గోల్..!! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ!












Click it and Unblock the Notifications