అప్పులు తీర్చడానికి మళ్ళీ అప్పులు ..ఏపీ మంత్రి క్లారిటీ
జగన్ పాలనలో విద్యుత్ వ్యవస్థ సర్వనాశనం అయ్యిందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. జగన్ అనాలోచిత నిర్ణయాల కారణంగా డిస్కంల పనితీరు దారుణంగా పడిపోయిందని మంత్రి పేర్కొన్నారు.గడిచిన ఐదేళ్లలో కాలంలో డిస్కంల అప్పులు అంతకంతకు పెరిగాయని ఆరోపించారు. డిస్కంల అప్పులు పేరు చెప్పి కరెంటు బిల్లులు పెంచి జగన్ ప్రజల రక్తం తాగారని మండిపడ్డారు. నాడు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఐదేళ్లలో ఒక్కసారి కూడా కరెంట్ బిల్లులను పెంచింది లేదని అన్నారు. అయితే జగన్ మాత్రం ఐదేళ్ల కాలంలో 9 సార్లు విద్యుత్ చార్జీలను పెంచారని దుయ్యబట్టారు.
డిస్కంల పేరు చెప్పి జగన్ విద్యుత్ చార్జీలు పెంచినా.. డిస్కంలకు ఒరిగింది ఏమీ లేదని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అన్నారు. అంతేగాకుండా వైసీపీ హయాంలో అప్పులు 79 శాతం పెరిగినట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం అప్పు తెస్తే కానీ నడపలేని స్థితిలో డిస్కంలు ఉన్నాయని మంత్రి గుర్తు చేశారు. గత ప్రభుత్వం చెల్లించాల్సిన సబ్సిడీలు, ఇతర మొత్తాలు కలిపి ఇప్పటికి రూ.34,954 కోట్లను బకాయిలుగా ఉన్నాయని తెలిపిన మంత్రి ,వైసీపీ ఏలుబడిలో డిస్కంల అప్పులు కట్టడానికి మళ్లీ మళ్లీ అప్పులు చేశారని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గతంలో ఉన్న పరిస్థితిని మార్చే దిశగా అడుగులు వేస్తున్నామని మంత్రి రవి కుమార్ పేర్కొన్నారు.

జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత డిస్కంల పనితీరు దారుణంగా పడిపోయిందని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. వాటి పని తీరు ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రేటింగ్ లో కూడా మన డిస్కంలు 'ఏ' నుంచి బీ,సీ,డీ కేటగిరిలకు పడిపోయినట్లు గుర్తు చేశారు. రేటింగ్ పడిపోవడంతో అప్పులపై వడ్డీ రేటు కూడా పెరిగిందని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన సమయంలో కూడా చంద్రబాబు విధానపరమైన నిర్ణయాల కారణంగా డిస్కంల పనితీరులో 'ఏ' రేటింగ్ ఉండేవని గుర్తు చేశారు. విభజన సమయంలో ఏపీ చాలా ఇబ్బందులు ఎదుర్కొందని.. సవాళ్లు మనకు కొత్తేమీ కాదని అన్నారు.
విద్యుత్ వ్యవస్థను పటిష్ఠం చేయడంలో చంద్రబాబుకు మంచి ట్రాక్ రికార్డ్ ఉందని చెప్పారు. సీఎం ఇప్పుడు విద్యుత్ పై ప్రత్యేక శ్రధ్ద పెట్టినట్లు తెలిపారు. త్వరలోనే అప్పులను తగ్గించి, డిస్కంలను గాడిలో పెట్టేలా చర్యలు చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ రేటింగ్ ల్లో ఏ ప్లస్ కోసం తాము ఆరాటపడమని తెలిపిన ఆయన, మా పనికి తగ్గ ఫలితాలు రానున్న రోజుల్లో ప్రజలు చూస్తారని వివరించారు. ఎట్టిపరిస్థితిల్లో కూడా ప్రజల మీద అధిక భారం వేసే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..!












Click it and Unblock the Notifications