చంద్రబాబుకు వెన్నులో వణుకు పుడుతోంది.. బినామీ ఆస్తుల కోసమే ఉద్యమాలు : కన్నబాబు
అభివృద్ది వికేంద్రీకరణ ద్వారా రాష్ట్ర సమగ్ర అభివృద్దిని సీఎం జగన్ కోరుకుంటున్నారని.. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతీ దానికి సైంధవుడిలా అడ్డుపడుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. చంద్రబాబు, టీడీపీ నాయకులు అభివృద్ధి నిరోధకులుగా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్దిని చంద్రబాబు ఇంకెంతకాలం అడ్డుకుంటారో చూస్తామని హెచ్చరించారు. అభివృద్ది వికేంద్రీకరణ,మండలి రద్దులను అడ్డుకుంటే ప్రజలు చంద్రబాబును మరింతగా తిరస్కరిస్తారని అన్నారు.
కేవలం బినామీ ఆస్తులను కాపాడుకునేందుకే చంద్రబాబు అమరావతిలో కృత్రిమ ఉద్యమాలు చేస్తున్నారని కన్నబాబు ఆరోపించారు. అమరావతిలో జరిగిన అక్రమాలు బయటపడుతుంటే చంద్రబాబు వెన్నులో వణుకు పుడుతోందన్నారు. మూడు రాజధానుల ఏర్పాటును వ్యతిరేకిస్తున్న చంద్రబాబు.. ఉత్తరాంధ్ర,రాయలసీమ ప్రజలు ఇంకా వెనుకబాటుతనంలోనే ఉండాలని కోరుకుంటున్నారని మండిపడ్డారు.

ఇక కాపు మహిళల కోసం ప్రవేశపెట్టిన కాపు నేస్తం పథకంపై కన్నబాబు సీఎం జగన్కు ధన్యవాదాలు తెలిపారు. ఆర్థికంగా వెనుకబడ్డ కాపులకు ఈ పథకం ఎంతగానో మేలు చేస్తుందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే రైతు భరోసా, నాడు-నేడు, నేతన్న హస్తం, ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల ప్రజలకు జగన్ భరోసా ఇస్తున్నారని చెప్పారు. అన్ని ప్రాంతాలు,అన్ని వర్గాలు సమానంగా అభివృద్ది చెందాలన్నదే తమ లక్ష్యం అని స్పష్టం చేశారు.
-
YSRCP: వెంటాడుతున్న 11, పార్లమెంట్లో ఊహించని ట్విస్ట్ -
వైసీపీ జోలికెళ్లను, జగన్ టార్గెట్ కాదు-రూటుమార్చిన షర్మిల..! -
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !!












Click it and Unblock the Notifications