ముద్రగడ ఉద్యమం ఏమైంది? టీడీపీతోనే కాపులు: నారాయణ విమర్శలు
ముద్రగడ పద్మనాభంకు ప్రజల మద్దతు లేదని కాకినాడ కార్పొరేషన్ విజయంతో తేలిపోయిందని మంత్రి నారాయణ అన్నారు.
విజయవాడ: ముద్రగడ పద్మనాభంకు ప్రజల మద్దతు లేదని కాకినాడ కార్పొరేషన్ విజయంతో తేలిపోయిందని మంత్రి నారాయణ అన్నారు. ముద్రగడను తిరస్కరించినట్లేనని వ్యాఖ్యానించారు. కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబుతో మంత్రి భేటీ అయ్యారు.
కాకినాడలో టీడీపీ గెలుపునకు కృషి చేసిన మంత్రిని సీఎం అభినందించారు. అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడారు. కాపులు ఎక్కువగా ఉన్న కాకినాడలో ఈ స్థాయి విజయం దక్కిందంటే వారంతా తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నట్లేనని నారాయణ పేర్కొన్నారు. ఎన్నికలు ముగియగానే ముద్రగడ ఉద్యమాన్ని వాయిదా వేశారని మంత్రి ఆరోపించారు.

కాపు రిజర్వేషన్లపై త్వరలోనే నివేదిక రానుందని నారాయణ స్పష్టంచేశారు. మరోవైపు ప్రతిపక్షనేత జగన్ వ్యాఖ్యలు సహించరానివిగా ఉన్నాయన్నారు. అందుకే ఆయన్ను రెండు చోట్లా ప్రజలు తిరస్కరించారన్నారు. జగన్ ప్రతి గడపా తొక్కినా.. ప్రజలు వ్యతిరేకంగా ఓటు వేశారని అన్నారు.
-
పెట్రోల్ కష్టాలు.. వారానికి 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
CSK vs RCB: కొంపముంచిన నోబాల్.. చెన్నైని చిత్తు చేసిన ఆర్సీబీ! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!!












Click it and Unblock the Notifications