ముద్రగడ ఉద్యమం ఏమైంది? టీడీపీతోనే కాపులు: నారాయణ విమర్శలు
ముద్రగడ పద్మనాభంకు ప్రజల మద్దతు లేదని కాకినాడ కార్పొరేషన్ విజయంతో తేలిపోయిందని మంత్రి నారాయణ అన్నారు.
విజయవాడ: ముద్రగడ పద్మనాభంకు ప్రజల మద్దతు లేదని కాకినాడ కార్పొరేషన్ విజయంతో తేలిపోయిందని మంత్రి నారాయణ అన్నారు. ముద్రగడను తిరస్కరించినట్లేనని వ్యాఖ్యానించారు. కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబుతో మంత్రి భేటీ అయ్యారు.
కాకినాడలో టీడీపీ గెలుపునకు కృషి చేసిన మంత్రిని సీఎం అభినందించారు. అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడారు. కాపులు ఎక్కువగా ఉన్న కాకినాడలో ఈ స్థాయి విజయం దక్కిందంటే వారంతా తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నట్లేనని నారాయణ పేర్కొన్నారు. ఎన్నికలు ముగియగానే ముద్రగడ ఉద్యమాన్ని వాయిదా వేశారని మంత్రి ఆరోపించారు.

కాపు రిజర్వేషన్లపై త్వరలోనే నివేదిక రానుందని నారాయణ స్పష్టంచేశారు. మరోవైపు ప్రతిపక్షనేత జగన్ వ్యాఖ్యలు సహించరానివిగా ఉన్నాయన్నారు. అందుకే ఆయన్ను రెండు చోట్లా ప్రజలు తిరస్కరించారన్నారు. జగన్ ప్రతి గడపా తొక్కినా.. ప్రజలు వ్యతిరేకంగా ఓటు వేశారని అన్నారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications