సంధ్యారాణి మృతిపై పత్తిపాటి
గుంటూరు: మెడికో సంధ్యా రాణి మృతి కేసులో దోషులను ఎట్టి పరిస్థితుల్లోను వదిలే ప్రసక్తి లేదని మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. ఆమెను ఎక్కడున్నా వదలబోమని.. ఆమెను అరెస్ట్ చేయకుండా తాత్సారం చేస్తున్నారని వస్తున్న ఆరోపణలను ఖండించారు. లక్ష్మి, ఆమె భర్త పారిపోయారని, వారి సెల్ ఫోన్లు స్విచ్చాఫ్ చేసుండటంతోనే పోలీసులు ట్రేస్ చేయలేకపోతున్నారని పత్తిపాటి అన్నారు. బీచ్ ఫెస్టివెల్ వివాదం, వైసీపీ జై ఆంధ్రప్రదేశ్ సభను విశాఖలో నిర్వహించడం విడ్డూరమన్నారు. జగన్ ఈ సభను ఢిల్లీలో నిర్వహించాలని సవాల్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసేందుకే జగన్ ఇలా చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. గుంటూరు కేంద్రంగా నడుస్తున్న నకిలీ విత్తనాలు కల్తీ కరం. కల్తీకి పాల్పడిన వారి ఫై కఠిన చర్యలు తీసుకుంటాముని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తి పాటి పుల్లరావు హెచ్చరించారు. కల్తీకి పాల్పడిన వ్యక్తులు ఫై క్రిమినల్ కేసులు నమోదు చేస్తూన్నామన్నారు. గుంటూరులో ఎటువంటి కల్తీ వ్యాపారాలు లేకుండా చేస్తామన్నారు. ప్రజలకు హనికలిగించే ప్రారిశ్రామిక మిల్లలు లైసేన్సలు రద్దు చేస్తామన్నారు. సాగర్ కుడి కాలువ నుండి నీటి విడుదల చేశామని, చివరి పంట కు నీళ్లు అందించడమే మా ప్రభుత్వ విధానమన్నారు.