ఏపీలో "భీమ్లా నాయక్" వివాదం.. మధ్యలో జూ. ఎన్టీఆర్ ప్రస్తావన !! : చంద్రబాబుపై పేర్ని నాని సెటైర్లు
ఆంధ్రప్రదేశ్లో పవన్ కల్యాణ్ "భీమ్లా నాయక్" టికెట్ల ధరల వ్యవహారం రాజకీయ దుమారం రేగుతుంది. అధికార, విపక్షాల మధ్య మాటల దాడి తీవ్రమైంది. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆపార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్పై రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని విరుచుకుపడ్డారు. ప్రతి అంశాన్ని రాజకీయంగా వాడుకుని పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. పవన్ కల్యాణ్ కొత్త సినిమా భీమ్లా నాయక్ విషయంలో ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు.
జూ. ఎన్టీఆర్ను ఎప్పుడైనా పట్టించుకున్నారా ?
పవన్ కల్యాణ్ సినిమా విషయంలో చంద్రబాబు, లోకేష్ పిల్లి మొగ్గలు వేస్తున్నారని మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమ్లా నాయక్ సినిమాను తమ ప్రభుత్వం తొక్కడం ఏమిటీ ప్రశ్నించారు. తొక్కడమంటే ఎన్టీఆర్, హరికృష్ణలను మీరే చేసిన పని అని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ జెండా మోసిన జూ. ఎన్టీఆర్ను ఎప్పుడైనా పట్టించుకున్నారా? అని నిలదీశారు. జూ. ఎన్టీఆర్ సినిమాను చంద్రబాబు ఏనాడైనా ప్రశంసించారా? అని ప్రశ్నించారు.
బ్లాకులో అమ్ముతుంటే చూస్తూ ఉండాలా?
దేశంలో బ్లాక్ మార్కెట్ను ప్రోత్సహిస్తుంది టీడీపీ, ఏపీ బీజేపీలే అని మంత్రి నాని ఆరోపించారు. పవన్ కల్యాణ్ కోసం తండ్రికొడుకులు తహతహలాడుతున్నారని విమర్శించారు. ఇలా ఏప్పుడైనా జూ. ఎన్టీఆర్ మూవీ వచ్చినప్పుడు మీరు తహతహలాడారా? అని నిలదీశారు. కుప్పంలో వన్ సైడ్ లవ్ ఉండదు అన్నావు? కానీ, ఇదేమి లవ్.. ఏ సైడ్ లవ్? బాబు అంటూ మంత్రి సెటైర్లు విసిరారు. బ్లాక్లో సినిమా టికెట్స్ అమ్ముకోడానికి, వ్యవస్థ దెబ్బతినడానికి చంద్రబాబు కారణమని ఆరోపించారు. సినిమా టికెట్లు బ్లాకులో అమ్ముతుంటే చూస్తూ ఉండాలా? అని ప్రశ్నించారు. గౌతమ్రెడ్డి మృతితో జీవో ఆలస్యమైందని మంత్రి తెలిపారు.
ఈ నీతి మాలిన పనులేంటి పవన్..?
తన సినిమాను ఉచితంగా చూపిస్తా అన్నాయనకు ఇవన్నీ ఎందుకు? అంటూ పవన్ కల్యాణ్ ను ఉద్దేశించిన మంత్రి పేర్నినాని సెటైర్లు విసిరారు. ప్రీరిలీజ్ ఫంక్షన్ ఒక రోజు పోస్ట్పోన్ చేసుకున్నప్పుడు.. "భీమ్లా నాయక్" సినిమా మరో రెండు రోజులు వాయిదా వేసుకోవచ్చుకదా ? అని ప్రశ్నించారు. మైకు పట్టుకుంటే నీతులు చెప్తాడు.. మరి ఈ నీతి మాలిన పనులేంటి..? అని పవన్ నిలదీశారు. సినిమా బాగుంటే జనం చూస్తారు గానీ ఇలాంటి పిచ్చిపనులేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. పుష్ప చూళ్ళేదా...?. అత్తారింటికి దారేది బాగుంది జనం చూసారు కదా అని ప్రశ్నించారు .
Recommended Video
బాలకృష్ణ నాతో మాట్లాడింది నిజం కాదా ?
బాలయ్య "అంఖడ "మూవీ రిలీజ్ ముందే ఆ సినిమా ప్రొడ్యూసర్స్ ఎమ్మెల్యే మేకా ప్రతాప అప్పారావు ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కలవడానికి ప్రయత్నించారని మంత్రి పేర్ని నాని తెలిపారు. విజయవాడ ఆర్ ఆండ్ బీ గెస్ట్ హౌస్ లో కలిసింది నిజం కాదా? అని ప్రశ్నిచారు. బాలకృష్ణ స్వయంగా తనతో మాట్లాడినట్లు చెప్పారు. ఇదే విషయాన్ని సీఎం జగన్ తెలిపాను. బాలయ్య రానవసరం లేదు.. ఆయన పెద్దరికం పోతుందని జగన్ అన్నారని చెప్పారు. వారికి ఏమి కావాలో చేసి పెట్టాలని తనకు చెప్పినట్లు నాని గుర్తు చేశారు.