సీన్ రిపీట్, రోజాను దూరం పెట్టిన పెద్దిరెడ్డి, డీసీపీ, ఎంపీలు వెళ్లినా మేడమ్ మాత్రం, హుష్ కాకి !
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారానికి కౌంట్ డౌన్ మొదలైయ్యింది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యాలని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి, మరోసారి అధికారంలోకి రావాలని వైఎస్ జగన్ పోటాపోటీగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేసిన ఆర్ కే రోజా పరిస్థితి అయోమయంగా తయారైయ్యింది. సొంతపార్టీ నాయకులతోనే రోజాకు లేనిపోని సమస్యలు వస్తున్నాయి.
నగిరిలో రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన రోజా మంత్రి అయ్యారు. రెండుసార్లు చాలా తక్కువ ఓట్లతోనే రోజా ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పుడు నగిరిలోని ఐదు మండలాల్లోని ముఖ్యమైన వైసీపీ నాయకులు రోజా తీరుతో విసిగిపోయి ఆమె తరపున ఎన్నికల ప్రచారం చెయ్యకుండా సైలెంట్ అయిపోయారు. అయితే మొండిపట్టుతో ఎమ్మెల్యే టిక్కెట్ తెచ్చుకున్న మంత్రి రోజా నగిరి అసెంబ్లీ నియోజక వర్గంలో ఆమె వెంట ఉండే కొంత మంది నాయకులతోనే ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.

కార్వేటినరగం సమీపంలోని పెనమలూరు మండలం వైసీపీ గౌరవాధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సలహాదారుడు, చిత్తూరు మాజీ ఎంపీ జ్ఞానేంద్ర రెడ్డి సోదరుడు పాలసముంద్రం నరసింహారెడ్డి ఇటీవల అనారోగ్యంతో మరణించారు. అయితే ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న చాలా మంది వైసీపీ నాయకులు నరసింహా రెడ్డి అంత్యక్రియలకు హాజరుకాలేకపోయారు. ఇప్పుడు నరసింహా రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, చిత్తూరు ఎంపీ ఎన్ రెడ్డప్ప, చిత్తూరు మాజీ ఎమ్మెల్యే గోపీనాథ్ కుమారుడు భూపేష్, చిత్తూరు, గంగాధరనెల్లూరు, పూతలపట్టు అసెంబ్లీ నియోజక వర్గాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు, చాలా మంది వైసీపీ నాయకులు పెనుమూరు చేరుకుని నరసింహా రెడ్డి, జ్ఞానేంద్ర రెడ్డి కుటుంబ సభ్యులను ఓదర్చారు. దాదాపు చిత్తూరు జిల్లాలోని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు అందరూ అక్కడికి వెళ్లారు.

పాత సమస్యలు, గొడవలు మరిచిపోయి పెద్దిరెడ్డితో మంచితనంతో ఉండివుంటే ఈ రోజు నగిరిలో రోజా కళ్లు మూసుకుని గెలిచేది అని ఆ ప్రాంతంలోని వైసీపీ నాయకులు అంటున్నారు. అయితే ఎన్నికల సమయంలో కూడా బెట్టు చేస్తే రోజాకు మొదటికే మోసం వస్తోందని, ప్రతి ఓటు విలువైనదిని అని రోజా ఇప్పటికైనా తెలుసుకుంటే ఆమెకే మంచిదని నగిరి వైసీపీ నాయకులు అంటున్నారు. ఇవేవి పట్టనట్లు రోజా నగిరిలో ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications