చంద్రబాబు రోడ్ షోలో అగ్నిప్రమాదం- మంటలు అంటుకున్నా స్పీచ్ కంటిన్యూ
కడప: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. రాయలసీమ జిల్లాల్లో పర్యటిస్తోన్నారు. తొలుత కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఆయన పర్యటించారు. రోడ్ షోల్లో ప్రసంగించారు. ఇవ్వాళ కడప జిల్లాలో అడుగుపెట్టారు. నంద్యాల మీదుగా ఆయన కడప జిల్లాలో ఎంట్రీ ఇచ్చారు. జిల్లాలోని జమ్మలమడుగులో రోడ్ షో నిర్వహించారు.
రాయలసీమలో నీటి ప్రాజెక్టుల నిర్మాణం స్తంభించిపోయిందనే ఉద్దేశంతో ఆయన ఈ పర్యాటనను చేపట్టారు. ప్రాజెక్టులను సందర్శించడానికి ఈ పర్యటనను తలపెట్టారు. పెన్నా టు వంశధార పేరుతో దీన్ని నిర్వహిస్తోన్నారు. నందికొట్కూరులో ముచ్చుమర్రి - బనకచర్ల ప్రాజెక్టులను సందర్శించారు. రోడ్ షోలో పాల్గొన్నారు.

అనంతరం ఈ ఉదయం ఆయన నంద్యాల, కోవెలకుంట్ల మీదుగా జమ్మలమడుగు నియోజకవర్గానికి చేరుకున్నారు. రోడ్ షోలో భాగంగా జమ్మమడుగు టౌన్లో ప్రసంగించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు.
జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత రాయలసీమ తీవ్ర వివక్షకు గురైందని, నీటి ప్రాజెక్టుల నిర్మాణం స్తంభించిందని ఆరోపించారు. నీటి ప్రాజెక్టుల్లో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుందనీ విమర్శిచారాయన. పోలవరాన్ని తామే ప్రారంభించామని, మళ్లీ తామే పూర్తి చేసి తీరుతామనీ చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
చంద్రబాబు రోడ్ షోలో అగ్నిప్రమాదం- మంటలు అంటుకున్నా స్పీచ్ కంటిన్యూ..!#Chandrababu #FireAccident #Jammalamadugu #AndhraPradesh #Oneindiatelugu pic.twitter.com/mDDg1xw1D5
— oneindiatelugu (@oneindiatelugu) August 2, 2023
కాగా- చంద్రబాబు ప్రసంగిస్తోన్న సమయంలో స్వల్పంగా అగ్నిప్రమాదం సంభవించింది. ఆయన ఉన్న వాహనానికి వెనుకలే ఉన్న ఓ తోపుడు బండి మంటలకు పూర్తిగా దగ్ధమైంది. స్థానికుడొకరు ఈ తోపుడు బండిపై చిన్న హోటల్ను నడుపుతున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పటాకులు కాల్చడం వల్ల నిప్పురవ్వలు పడి ఆ తోపుడుబండి దగ్ధమైందని చెబుతున్నారు.
చంద్రబాబు రాక సందర్భంగా నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారని, ఇష్టానుసారంగా పటాకులు కాల్చారంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు విమర్శిస్తోన్నారు. నిప్పురవ్వలు పడి తోపుడు బండి మంటల్లో కాలిపోతున్నప్పటికీ.. చంద్రబాబు మాత్రం తన ప్రసంగాన్ని మానలేదంటూ ధ్వజమెత్తుతున్నారు.
-
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..!












Click it and Unblock the Notifications