నోటీసులిస్తాం: 'ఆంధ్రజ్యోతి' కథనం మండలిలో రభస
హైదరాబాద్: ఆంధ్రజ్యోతి దిన పత్రిక పైన సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తామని ముగ్గురు ఎమ్మెల్సీలు శనివారం పేర్కొన్నారు. ఇటీవల తెరాసలో చేరిన ఎమ్మెల్సీలు భాను ప్రసాద్, యాదవ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి శనివారం నాటి సమావేశంలో ఆంధ్రజ్యోతిపై హక్కుల ఉల్లంఘన నోటీసు అంశాన్ని ప్రస్తావించారు.
భానుప్రసాద్ మాట్లాడుతూ... ఆంధ్యజ్యోతి దినపత్రికలో.. బడ్జెట్లో అమరుల కుటుంబాలకు అన్యాయం జరిగిందని, తెలంగాణ ఉద్యోగులు ఇంక్రిమెంట్లు పెంచుకున్నారని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జీతాలు పెంచుకున్నారని రాశారన్నారు. అయితే, బడ్జెట్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఒక్క రూపాయి కూడా జీతం పెంచలేదని, కనీసం దానికి సంబంధించిన బిల్లు కూడా ప్రవేశపెట్టలేదని భానుప్రసాద్ తెలిపారు.
ఆంధ్రజ్యోతి పత్రిక బాధ్యతారహితంగా, సభ్యుల గౌరవానికి భంగం కలిగించేలా వార్తలు రాసిందని, అలాంటి వార్తలు రాసిన పత్రికపై చర్యలు తీసుకోవాలన్నారు. సభ్యులపై రకరకాల ఆరోపణలు చేశారని, సభ్యులు గౌరవాన్ని కాపాడాలని, ఆ పత్రిక పట్ల సభ కఠినంగా వ్యవహరించాలని, సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని కోరారు.

అందుకు తాము పది మంది సభ్యులం నోటీసును అందిస్తామన్నారు. సభా హక్కుల నోటీసును అందజేసేందుకు అనుమతించాలని ఎమ్మెల్సీలు యాదవ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి సైతం స్పీకర్ను కోరారు. ఈ అంశంపై టీడీపీ శాసనమండలి సభాపక్ష నేత అరికెల నర్సారెడ్డి స్పందించారు.
ఆ ముగ్గురు సభ్యుల ప్రతిపాదనపై అభ్యంతరం వ్యక్తం చేశారు. నిజంగానే సభ్యులకు ఇబ్బంది కలిగించేలా వార్తలున్నా, ప్రతిదానికీ ఇలా చర్యలు తీసుకుంటూ పోవడం సరికాదని, ఇతర పత్రికల్లోనూ అనేక వార్తలు వస్తున్నాయని, గతంలో టీవీ-9, ఏబీఎన్-ఆంధ్రజ్యోతి చానళ్లపై చర్యలు తీసుకోవాలని సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చి, ఏకంగా ఆ చానళ్ల ప్రసారాలనే నిలిపివేశారన్నారు.
ఇప్పుడేమో పత్రికలో వార్త వచ్చిందని, నోటీసు అంటున్నారని, ఇలా ప్రతి వార్తనూ పరిగణనలోకి తీసుకుని సభాహక్కుల పేరిట పత్రికలపై చర్యలు అంటే ప్రజలు క్షమించరన్నారు. కాగా, నర్సిరెడ్డి ప్రసంగం కొనసాగిస్తుండగానే ఆయన మైక్ కట్ చేశారు.
దీనిపై చైర్మన్ స్వామిగౌడ్ స్పందిస్తూ.. సభాహక్కుల ఉల్లంఘన నోటీసు రాతపూర్వకంగా ఇస్తే పరిశీలిస్తామని, ఇతర పత్రికల్లోనూ ఏం వచ్చిందో పరిశీలించాల్సి ఉందన్నారు. మండలి సమావేశం ముగిసిన తర్వాత మండలిలో నర్సారెడ్డి విలేకరులతో మాట్లాడారు. మీడియా ఎప్పుడూ అధికారపక్షానికి అనుకూలంగా ఉండదని, అందులో వచ్చే వార్తలను స్వాగతించాలన్నారు. కాగా, మండలి ఈ నెల 21వ తేదీ వరకు వాయిదా పడింది.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications