పవన్పై తర్వాత, సంచలనం చెబుతా: మోహన్ బాబు
హైదరాబాద్: తెలుగు సినీ హీరో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీపై తర్వాత స్పందిస్తానని ప్రముఖ తెలుగు సినీ మోహన్ బాబు అభిప్రాయపడ్డారు. ఆయన మంగళవారం తన కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకులు మండపంలో వేదపండితులు ఆయనను ఆశీర్వదించారు.
ఆలయ డిప్యూటీ ఈవో చిన్నమగారి రమణ శేషవస్త్రాలు బహూకరించి తీర్థప్రసాదాలను అందజేశారు. రామ్గోపాల్ వర్మ దర్శకత్వంలో తాను నటించిన 'రౌడీ' సినిమాను వచ్చే నెలలో విడుదల చేయనున్నట్లు మోహన్బాబు చెప్పారు.

పవన్ కళ్యాణ్ కొత్త పార్టీ జనసేనపై మీ స్పందన ఏమిటని అడిగితే, ఇది రాజకీయాలు మాట్లాడేందుకు వేదిక కాదని, అందువల్ల పవన్ పార్టీపై తర్వాత స్పందిస్తానని మోహన్ బాబు సమాధానం చెప్పకుండా దాటవేశారు.
మోహన్ బాబుకు రాజకీయాసక్తి ఉన్నప్పటికీ ఇంకా ఏ పార్టీలో చేరాలనే విషయంపై ఆయన నిర్ణయం తీసుకోలేదు. ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు. ఈ స్థితిలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు.
దేశం బాగు యువత చేతుల్లోనే ఉందని మోహన్ బాబు చెప్పారు. త్వరలో సంచలనాత్మక నిర్ణయం వెల్లడిస్తానని అన్నారు. తనకు ఎన్టీఆర్ స్ఫూర్తి అన్నారు. డబ్బులు, సారా ప్యాకెట్లకు అమ్ముడు పోకుండా ఓటు వేయాలన్నారు. ఎవరికి భయపడకుండా నిజాయితీగా ఓటేయాలన్నారు.
-
సొంత సినిమాను వదిలేసి పరాయి సినిమాకు భజనా? -
దురంధర్-2కు బిగ్ షాక్.. ఆన్లైన్లో ప్రత్యక్షమైన ప్రింట్! -
మెగా హీరో భార్యకు ఏమైంది?.. ఆ సీన్ చూస్తే దయ్యం పట్టినట్లే ఉంది! వీడియో -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
అన్న మళ్లీ హిట్ కొట్టాడోచ్.. పవన్ కళ్యాణ్ "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ రివ్యూ..! -
త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న తెలుగు హీరోయిన్.. వైజాగ్లో సందడి !! -
ధురంధర్2, ఉస్తాద్ భగత్ సింగ్.. వీటిల్లో ఏ సినిమాకు వెళ్లాలి? -
స్టార్ బ్యూటీతో కలిసి సైలెంట్గా ఓటీటీ డెబ్యూ ఇస్తున్న యంగ్ హీరో !! -
ఉస్తాద్కు బిగ్ షాక్...తొలి రోజే ఆన్లైన్లో HD ప్రింట్ ప్రత్యక్షం! -
అనుష్క పెళ్లి ట్విస్ట్: ఆ విషయాన్ని ఎందుకు హైలైట్ చేస్తున్నారు? -
‘ధురంధర్2’లో హైలైట్స్ ఇవే.. దద్ధరిల్లుతున్న థియేటర్లు -
కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు..












Click it and Unblock the Notifications