Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పోటెత్తిన తిరుమల, లక్షలాది మంది శ్రీవారి భక్తులు, ఇసుక వేస్తే కిందపడదు, గోవిందా!

తిరుమల/తిరుపతి: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల (tirumala) శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో (brahmotsavam) ఐదో రోజైన శుక్రవారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు త‌న‌కు ఎంతో ప్రీతిపాత్ర‌మైన గ‌రుడ వాహ‌నంపై లక్ష్మీకాసుల మాల ధరించి భ‌క్తుల‌కు అభ‌య‌మిచ్చారు. రాత్రి 7 గంటలకు గ‌రుడ‌సేవ (garuda vahanam) ప్రారంభ‌మైంది.

గరుడ వాహనం ముందు గజరాజులు (tirumala) నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా (brahmotsavam) జరిగింది. భక్తులు (tirumala)అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని (garuda vahanam) దర్శించుకున్నారు.

 Srivari Garuda Vahana Seva

గ‌రుడ వాహ‌నం (tirumala) స‌ర్వ‌పాప ప్రాయ‌శ్చిత్తం

అని పురాణాలు చెబుతున్నాయి. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ (garuda vahanam) అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన (tirumala) గరుడుని (garuda vahanam) దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని (brahmotsavam) భక్తకోటికి తెలియజెబుతున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి టీటీడీ అధికారులు పాల్గొన్నారు.

 Srivari Garuda Vahana Seva

వేకువ జామున నిండిపోయిన గ్యాలరీలు:

తిరుమలలోని (tirumala) శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాల్లో (brahmotsavam) భాగంగా శుక్ర‌వారం రాత్రి జ‌రుగ‌నున్న గరుడ వాహన సేవను (garuda vahanam) ద‌ర్శించేందుకు తెల్లవారుజాము నుంచే భ‌క్తులు గ్యాలరీల్లో వేచి ఉన్నారు. ఉద‌యానిక‌ల్లా గ్యాల‌రీలు భ‌క్తుల‌తో నిండాయి. శుక్రవారం (tirumala) వేకువ జామున 5 గంటలకు భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం ప్రారంభమైంది. తూర్పు, పశ్చిమ, ఉత్తరం, దక్షిణ మాడవీధుల్లో గ‌ల 200కు పైగా గ్యాలరీల్లో దాదాపు 2 లక్షల మంది భక్తులు (brahmotsavam) కూర్చునే అవ‌కాశ‌ముంది.

two lakh devotees participated in the Srivari Garuda Vahana Seva

శ్రీవారి (tirumala) భ‌క్తుల కోసం వేకువ జామున 5 గంటల నుండి 6 గంటల గంటల మధ్య పాలు, కాఫీ, ఉదయం 6.30 గంటల నుండి 8 గంటల మధ్య ఉప్మా, పొంగ‌ళి పంపిణీ చేశారు. ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఉదయం 10 గంటలకు (brahmotsavam) సాంబార్ అన్నం, టమాటా అన్నం, స్వీట్ పొంగల్ అందించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి దాదాపు 3 గంటల వరకు భక్తులకు (tirumala) రెండు లక్షలకు పైగా పులిహోర ప్యాకెట్లు పంపిణీ చేశారు.

సాయంత్రం (tirumala) సుండ‌ల్‌, కాఫీ, పాలు మళ్లీ పంపిణీ చేశారు. సాయంత్రం 7 గంటలకు గరుడవాహనం (garuda vahanam) ప్రారంభం కానుండ‌గా ఉత్తర, తూర్పు మాడ వీధుల్లో సాయంత్రం 6 గంటల వరకు (brahmotsavam) వెజిటబుల్ కిచిడీ పంపిణీ చేశారు.

టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర రెడ్డి, టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి గ్యాలరీలను (brahmotsavam) పరిశీలించి భ‌క్తులకు (tirumala) అందజేస్తున్న అన్న‌ప్ర‌సాదాలు, తాగునీరు, మ‌రుగుదొడ్లు ఇతర సౌకర్యాలపై భక్తులతో చర్చించి వివరాలు సేకరించారు, టీటీడీ అందిస్తున్న సేవలపై భక్తులు హర్షం వ్యక్తం చేశారు.

two lakh devotees participated in the Srivari Garuda Vahana Seva

ఈ సందర్భంగా (tirumala) టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గరుడ సేవను (garuda vahanam) చూడటానికి తిరుమల నాలుగుమాడ వీధుల్లో వేచి ఉన్న భక్తులకు కల్పిస్తున్న సదుపాయాలను (brahmotsavam) టీటీడీఈవో ధర్మారెడ్డితో కలసి శుక్రవారం సాయంత్రం పరిశీలించినట్టు తెలిపారు. గ్యాలరీలలో (tirumala) వేచి ఉండే ప్రతి భక్తుడికీ గరుడ వాహనంపై ఉన్న శ్రీ మలయప్ప స్వామివారి దర్శనం చేయించిన తరువాతే స్వామివారు ఆలయానికి వేంచేస్తారని కరుణాకర రెడ్డి తెలిపారు.

ఇప్పటికే గ్యాలరీల్లో (tirumala) లక్షలాది మంది (brahmotsavam) భక్తులు గురుడ వాహనం కోసం ఎదురుచూస్తున్నారని కరుణాకర రెడ్డి చెప్పారు. వారికి అవసరమైన ఆహారం, తాగునీరు, పాలు లాంటి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు. తాను చాలామందితో మాట్లాడానని, అందరూ టీటీడీ (garuda vahanam) ఏర్పాట్లపై సంతృప్తి, సంతోషం వ్యక్తం చేశారని టీటీడీ చైర్మన్ కరుణాకర రెడ్డి చెప్పారు. భక్తులకు చిన్న ఇబ్బంది కూడా కలుగకుండా అధికారులు (brahmotsavam) అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని టీటీడీ చైర్మన్ కరుణాకర రెడ్డి వివరించారు.

శ్రీ‌వారి సేవకులకు భక్తుల ప్ర‌శంస‌లు
అందించారు. తిరుమలలోని శ్రీవారి (tirumala) ఆయలం పరిసర ప్రాంతాల్లోని నాలుగు మాడ వీధుల్లో (garuda vahanam) వేచి ఉన్న భక్తులకు తెల్లవారుజాము (brahmotsavam) నుంచి అంకితభావంతో, భక్తిశ్రద్ధలతో సేవలందిస్తున్న శ్రీవారి సేవకుల నిస్వార్థ‌సేవలను టీటీడీ ఛైర్మన్, ఈవో కొనియాడారు. దాదాపు 1,500 మంది శ్రీవారి సేవకులు ఆహారపొట్లాల‌ ప్యాకింగ్, గ్యాలరీలలో అన్న‌ప్ర‌సాదాల (brahmotsavam) విత‌ర‌ణ‌, ఆరోగ్య శాఖ ఆధ్వ‌ర్యంలో తాగునీటి పంపిణీ త‌దిత‌ర సేవలను శ్రీవారి (ttd) భక్తులకు అందించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+