తల్లీకూతుళ్ల హత్య: భర్తలే చంపేసి శవాలను పాతిపెట్టారు
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణమైన జంట హత్యలు జరిగాయి. తల్లీకూతుళ్లను కిరాతకంగా హత్య చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం ఎల్ఎన్డీపేట గ్రామానికి చెందిన తల్లీకూతుళ్లు ఇళ్ల సావిత్రి (40), పులిబోయిన మంగతాయారు (19) హత్యకు గురయ్యారు.
వారిద్దరు గత నవంబర్ 2వ తేదీ నుంచి కనిపించకుండా పోయారు. దీనిపై పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. వారిద్దరు హత్యకు గురైనట్లు పోలీసు దర్యాప్తులో తేలింది. వారిద్దరిని భర్తలే హత్య చేసినట్లు తేలింది.
బుట్టాయగూడెం ండల కోటరామచంద్రాపురంం ఐటిడిఎ నుంచి ఎర్రాయిగూడెం వెల్లే దారి పక్కన గల జీడిమామిడి తోటలో వారిద్దరిని భర్తలు హత్య చేసి శవాలను పాతిపెట్టినట్లు తేలింది.
కుటుంబ కలహాల కారణంగానే వారిని హత్య చేసి శవాలను పాతిపెట్టినట్లు నిందితులు అంగీకరించారు. పూడ్చిపెట్టిన శవాలను పోలీసులు వెలికి తీసి రెవెన్యూ అధికారుల సమక్షంలో పోస్టుమార్టం చేశారు.