ఎంపీ బోసు వర్సస్ మంత్రి వేణు - సీఎం సీరియస్, తేల్చి చెప్పేసారు..!!
మంత్రి వేణుగోపాలకృష్ణ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ సీఎంకు బోస్ ఫిర్యాదు చేశారు. లిఖితపూర్వకంగా ఒక నివేదిక ఇచ్చినట్లు సమాచారం. నియోజకవర్గాల్లో ఇద్దరు సీనియర్లు పార్టీకి నష్టం చేసేలా వ్యవహరించటం ఏంటని సీఎం సీరియస్ అయ్యారని తెలుస్తోంది. దీని పైన వెంటనే చర్యలు తీసుకోవాలని ఎంపీ మిథున్ రెడ్డిని ఆదేశించారు. ఎంపీ కుమారుడికి టికెట్ అంశం తాను చూసుకుంటానని.. పార్టీలో ఇటువంటివి ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు.
Recommended Video

ముఖ్యమంత్రి జగన్ దృష్టి
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ కీలక నేతల మధ్య విభేదాలపై ముఖ్యమంత్రి జగన్ దృష్టి సారించారు. అక్కడ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ.. ఉమ్మడి గోదావరి జిల్లాల వైసీపీ రీజనల్ కో-ఆర్డినేటర్, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. ఎంపీ బోసును సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి పిలిచారు.

వారిద్దరి మధ్య అరగంటకు పైగా భేటీ జరిగింది. ఈ సందర్భంగా రామచంద్రపురం నియోజకవర్గంలో మంత్రి వేణుగోపాలకృష్ణ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ సీఎంకు బోస్ ఫిర్యాదు చేశారు. మంత్రి వేణు, ఆయన తనయుడు నరేన్ అక్రమాలను లిఖితపూర్వకంగానే సీఎంకు బోస్ నివేదించినట్టు విశ్వసనీయ సమాచారం.
విభేదాలపై సీఎం సీరియస్
అంతకు ముందు.. వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డితోనూ, ఉమ్మడి గోదావరి జిల్లాల రీజనల్ కో-ఆర్డినేటర్, రాజంపేట ఎంపీ మిథున్రెడ్డితోనూ బోస్ సమావేశమయ్యారు. తన విజయానికి సహక రించిన వైసీపీ నేతలపై మంత్రి వేణు అక్రమ కేసులు బనాయించి రౌడీషీట్లను నమోదు చేయించి వేధిస్తున్నారని బోసు నేరుగా సీఎంకు ఫిర్యాదు చేసారని తెలుస్తోంది.
కార్యకర్తల ఆలోచన మేరకే తాము పని చేయాల్సి ఉందని..తుది నిర్ణయం మీరే తీసుకోవాలని సీఎంతో బోసు చెప్పుకున్నట్లు సమాచారం. తన కుమారుడికి ఎమ్మెల్యే సీటు గురించి సమావేశం అయిన అంశం చర్చకు వచ్చింది. బోసు కుమారుడు రాజకీయ భవిష్యత్ తాను చూసుకుంటానని..విభేదాలు వీడి కలిసి కట్టుగా పని చేయాలని సీఎం నిర్దేశించారు.

టికెట్ దక్కేదెవరికి
బోస్తో సమావేశం అనంతరం సీఎం జగన్ తో ఎంపీ మిథున్రెడ్డి భేటీ అయ్యారు. రామచంద్రపురంలో మంత్రి వేణు, ఎంపీ బోస్ మధ్య నెలకొన్న విభేదాలు, నియోజకవర్గంలో వైసీపీ కేడర్లో నెలకొన్న అభిప్రాయ భేదాలను పరిష్కరించాల్సిందిగా సీఎం సూచించారు. ఈ నెల 26న సీఎం జగన్ అమలాపరం లో పర్యటించనున్నారు.
ఈలోగా ఇద్దరి నేతలతోనూ చర్చించి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని సూచన చేసినట్లు తెలుస్తోంది. అటు ఎంపీ వర్గం బోసు తన కుమారుడికి టికెట్ కు తన ఎంపీ పదవి కారణమైతే దాన్ని వదులుకోవటానికి సిద్దమనే సంకేతాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు రామచంద్రాపురం సీటు విషయంలో సీఎం నిర్ణయం పైన ఆసక్తి నెలకొంది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications