ఏ జిల్లాలో ఏ పార్టీ: తెరాసVsకాంగ్రెస్, టిడిపికీ గాలి
హైదరాబాద్: ప్రాదేశిక ఎన్నికల ఫలితాలలో తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి, కాంగ్రెసు పార్టీల మధ్య కొంత పోటీ కనిపిస్తున్నప్పటికీ.. తెరాస కొంత ముందంజలో ఉంది. ఇక తెలుగుదేశం పార్టీ పరువు కాపాడుకుంటోంది. మధ్యాహ్నం ఒకటిన్నర గంటల వరకు తెలంగాణలోని పది జిల్లాల్లో తెరాస 247, కాంగ్రెసు పార్టీ 242, టిడిపి 108 స్థానాలలో గెలుపొందాయి.
అదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో తెరాస, రంగారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ జిల్లాల్లో కాంగ్రెసు, ఖమ్మం జిల్లాలో టిడిపి ముందంజలో ఉంది. వరంగల్ జిల్లాలో కాంగ్రెసు, టిడిపిలో చెరి రెండు స్థానాల్లో, తెరాస నాలుగు స్థానాల్లో గెలిచింది.
నిజామాబాద్లో తెరాస 61, కాంగ్రెస్ 47, టిడిపి 8, అదిలాబాద్లో తెరాస 79, కాంగ్రెస్ 43, టిడిపి 26, కరీంనగర్లో తెరాస 53, కాంగ్రెస్ 34, టిడిపి 5, వరంగల్లో తెరాస 4, కాంగ్రెస్ 3, టిడిపి 2, ఖమ్మంలో తెరాస 0, కాంగ్రెస్ 8, టిడిపి 31, మహబూబ్ నగర్లో తెరాస 1, కాంగ్రెస్ 8, టిడిపి 2, రంగారెడ్డిలో తెరాస 24, కాంగ్రెస్ 56, టిడిపి 27, మెదక్లో తెరాస 13, కాంగ్రెస్ 22, టిడిపి 2, నల్గొండలో తెరాస 12, కాంగ్రెస్ 21, టిడిపి 5 స్థానాల్లో గెలుపొందాయి.
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు స్వగ్రామంలో తెరాస అభ్యర్థి గెలుపొందారు. మెదక్ జిల్లా సిద్దిపేట మండలం చింతమడకలో తెరాస తరఫున పోటీ చేసిన దేవమ్మ భారీ మెజార్టీతో గెలుపొందారు.