జగన్! 24 గంటలు టైమిస్తున్నా లేదంటే: మురళీ మోహన్ కోడలు హెచ్చరిక
Recommended Video

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి తనపై చేసిన ఆరోపణలను 24 గంటల్లోగా నిరూపించాలని రాజమండ్రి టీడీపీ ఎంపీ మురళీ మోహన్ కోడలు రూప డిమాండ్ చేశారు. ఆమె ఆదివారం హైదరాబాదులో మాట్లాడారు.
రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడైనా తనకు ప్రభుత్వ భూమి ఉన్నట్లుగా నిరూపిస్తే తనపై ఏ కేసుకైనా సిద్ధమని చెప్పారు. ఇతరులపై ఆరోపణలు చేసే ముందు ఆలోచించుకోవాలని హితవు పలికారు. ఆధారాలు ఉంటేనే జగన్ ఆరోపణలు చేయాలని చెప్పారు.

రాజమండ్రి బలభద్రపురంలో తనకు ప్రభుత్వం స్థలం ఇస్తానన్నప్పటికీ వద్దని చెప్పానని ఆమె అన్నారు. బాధ్యతగల ప్రతిపక్ష హోదాలో ఉన్న జగన్ ఒకరిపై ఆరోపణలు చేసినప్పుడు నిరూపించాలన్నారు. తనపై చేసిన ఆరోపణలకు గాను ఒకరోజు సమయం ఇస్తున్నానని చెప్పారు.
అంతకుముందు, మురళీ మోహన్ మాట్లాడుతూ... జగన్పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 18 నెలల పాటు జైల్లో గడిపిన జగన్కు తన గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. అసత్య ఆరోపణలు చేసి నిరూపించలేకపోయారన్నారు. అలీఫ్ అనే సంస్థ సేవా కార్యక్రమాలు చేస్తోందని, ప్రభుత్వం దానికి భూమి కేటాయిస్తే తనకేం సంబంధమన్నారు.
జగన్ తన పాదయాత్రలో తనపై అనుచిత ఆరోపణలు చేస్తున్నారన్నారు. జగన్ తీరు మార్చుకోకుంటే పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఇసుక దందాలకు తనకు సంబంధం ఏమిటన్నారు. సంపాదన కోసం రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం తనకు లేదన్నారు. అలీఫ్ సంస్థతో తమ కుటుంబానికి సంబంధమే లేదన్నారు. నేను తప్పు చేసినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమన్నారు.
-
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!!












Click it and Unblock the Notifications