కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాయలసీమ నేత బైరెడ్డిపై హత్య కేసు నమోదు

By Pratap
|
Google Oneindia TeluguNews

Murder case on Byreddy Rajasekhar Reddy
కర్నూలు: రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిపై ఆదివారం హత్య కేసు నమోదయింది. కర్నూలు నగరంలో శనివారం జరిగిన నందికొట్కూర్ మార్కెట్ యార్డు వైస్‌చైర్మన్ సాయి ఈశ్వర్ హత్యకు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, ఆయన తండ్రి శేష శయనారెడ్డి, తమ్ముని కుమారుడు సిద్ధార్థరెడ్డితో పాటు ముచ్చుమర్రి గ్రామానికి చెందిన కె బాషాలు కారణమని హతుడి కుటుంబ సభ్యులు మూడవ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

హత్యా స్థలంలో నిందితుల్లో ఒకడిగా భావిస్తున్న కె బాషా సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. దీని ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. హత్య సంఘటనలో పాములపాడు మండలం ఇస్కాల గ్రామానికి చెందిన వారు కూడా ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తెలిసింది.

దీంతో ఆ దిశగా కూడా పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. నిందితులు ఏ స్థాయి వారైనా వదిలి పెట్టే ప్రసక్తి లేదని, త్వరలోనే హత్యకు కారకులెవరో గుర్తించి అరెస్ట్ చేస్తామని పోలీసు అధికారులు చెబుతున్నారు.

కర్నూలులోని నాగిరెడ్డి రెవె న్యూ కాలనీలో జరిగిన సాయిఈశ్వర్ హత్యకేసులో పోలీసులు కీలక సమాచారాన్ని రాబట్టారు. ఆదివారం మృతదేహానికి స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం అనంతరం మృతదే హాన్ని బంధువులకు అప్పగించారు.

English summary
murder case has been booked against Rayalaseema leader Byreddy Rajasekhar Reddy in Kurnool district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X