జగన్ పై సోషల్ పోస్టు- నెల్లూరు కార్యకర్తకు పోలీసు కాల్స్- ఆ తర్వాత చంద్రబాబు...
ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియా పోస్టుల పర్వం కొనసాగుతోంది. ఇందులో టీడీపీ కార్యకర్తలతో పాటు ఆ పార్టీకి సానుభూతిపరులుగా ఉంటున్న కొందరు వ్యక్తులు యాక్టివ్ గా ఉంటున్నారు. వీరిపై సీఐడీ నిఘా కూడా అదే స్ధాయిలో ఉంటోంది. ఇప్పటికే సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో టీడీపీ సానుభూతిపరులుగా ఉన్న పలువురికి నోటీసులు వెళ్లడం, విచారణ సాగడం జరుగుతూనే ఉంది.
తాజాగా నెల్లూరుకు చెందిన శ్రీకాంత్ రెడ్డి అనే టీడీపీ కార్యకర్త వైసీపీ ప్రభుత్వంపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. దీనిపై ఫిర్యాదులు రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఫోన్ కాల్స్ చేసి శ్రీకాంత్ రెడ్డిని విచారించారు. ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు పెట్టడంపై ఆరా తీశారు. తరచూ పోలీసుల నుంచి ఫోన్ కాల్స్ వస్తుండటంతో దీనిపై తన ఆవేదనను ఆడియో రూపంలో తిరిగి వాట్సాప్ గ్రూప్స్ లో షేర్ చేశాడు. ఇది టీడీపీ నేతలకు చేరడంతో వారు అధినేత చంద్రబాబుకు విషయం వివరించారు. ఆ తర్వాత చంద్రబాబు శ్రీకాంత్ రెడ్డికి ఫోన్ చేశారు.

నేరుగా చంద్రబాబు నుంచే ఫోన్ కాల్ రావడంతో శ్రీకాంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశాడు. నేనే తప్పూ చేయలేదని, బెదిరింపులకు లొంగబోనని, చట్టప్రకారం ఏ చర్యలు తీసుకున్నా సిద్దమని చంద్రబాబుకు తెలిపాడు. దీంతో చంద్రబాబు కూడా తాను అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. బెదిరింపులకు లొంగకుండా ధైర్యంగా తన అభిప్రాయాన్ని ఆడియో రూపంలో బయటపెట్టిన శ్రీకాంత్ రెడ్డిని అభినందించారు. తప్పు చేయని వాళ్లు భయపడాల్సిన అవసరం లేదని చంద్రబాబు శ్రీకాంత్ రెడ్డికి ధైర్యం చెప్పారు.
-
పుకార్ల దేశం.. అందుకే పెట్రోల్ బంకుల వద్ద ఆ క్యూలు! -
ఈ చేపల్లో తేడాగా ఉన్నది ఏదో కనిపెట్టగలరా..? -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ












Click it and Unblock the Notifications