Vijayawada : విజయవాడ పార్లమెంట్ పరిధిలో వైసీపీకి ఎదురుదెబ్బ..!
సార్వత్రిక ఎన్నికల ముందు అధికార వైసీపీకి ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. ఎన్టీఆర్ జిల్లా ,నందిగామ నియోజకవర్గానికి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. నాలుగో(4) వార్డ్ కౌన్సిలర్ మారం అమరయ్య , 13వ వార్డు కౌన్సిలర్ గద్దె శేషుకుమారి తాము వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు.

గతంలో టీడీపీలో ఉన్న అమరయ్యను వైస్ చైర్మన్ పదవి ఆఫర్ ఇచ్చి తమ పార్టీలో చేరుకున్నారు స్థానిక వైసీపీ నేతలు. అయితే వైసీపీలో చేరినప్పటికీ అమరయ్యకు ఎలాంటి పదవి దక్కకపోవడంతో ఆయన తిరిగి తన సొంత గూటికి చేరాలని డిసైడ్ అయ్యారు.

పార్టీని వీడే సమయంలో అమరయ్య వైసీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, ఆయన సోదరుడు ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్లపై తీవ్ర విమర్శలు చేశారు. వైస్ చైర్మన్ పదవి ఇస్తామని 20 లక్షల రూపాయలు ఖర్చు చేయించి తనని మోసం చేశారని మొండితోక బ్రదర్స్పై కౌన్సిలర్ అమరయ్య ఆరోపణలు చేశారు. వైసీపీ నాయకులు వాడుకొని వదిలేశారని పార్టీని వీడిన ఇద్దరు కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వారు వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు.

కౌన్సిలర్లు అమరయ్య , గద్దె శేషుకుమారి సోమవారం టీడీపీ నేత కేశినేని చిన్ని సమక్షంలో టీడీపీలో చేరారు. వీరితో పాటు, మరికొంత మంది కౌన్సిలర్లు సైతం టీడీపీ వైపు చూస్తున్నట్టు సమాచారం అందుతుంది. ఇదే కనుక జరిగితే నందిగామ చైర్మన్ పదవి టీడీపీ వశం అయ్యే అవకాశం ఉంది. విజయవాడ పార్లమెంట్ పరిధిలో చక్రం తిప్పుతున్న కేశినేని చిన్ని.. వైసీపీ నేతలకు గాలం వేస్తోన్నట్టు సమాచారం అందుతుంది. దీంతో వైసీపీ కౌన్సిలర్లు టీడీపీ వైపు చూస్తున్నారు.
-
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications