నంద్యాల వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఓటింగ్ 90శాతానికి మించినా ఆశ్చర్యం లేదు: బ్రహ్మానందరెడ్డి

నంద్యాల ఉపఎన్నికలో బుధవారం మధ్యాహ్నం 3గంటల వరకు దాదాపు 65శాతం వరకు పోలింగ్ జరిగిందని టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి తెలిపారు.

|
Google Oneindia TeluguNews

కర్నూలు: నంద్యాల ఉపఎన్నికలో బుధవారం మధ్యాహ్నం 3.30గంటల వరకు దాదాపు 65శాతం వరకు పోలింగ్ జరిగిందని టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దాదాపు అన్ని పోలింగ్ కేంద్రాల్లో 55శాతం కంటే ఎక్కువగానే పోలింగ్ జరిగిందని చెప్పారు.

సభ్యత లేని జగన్‌కు బుద్ధి చెప్పండి: చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు సభ్యత లేని జగన్‌కు బుద్ధి చెప్పండి: చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు

ఎక్కువశాతం మంది మహిళలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని బ్రహ్మానందరెడ్డి తెలిపారు. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో గంటసేపు ఆలస్యమైందని, మిగితా చోట్ల చాలా ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు.

nandyal bypoll voting percentage may will raise to 90%, says Brahmananda reddy

ఈ ఉపఎన్నికలో 80శాతం వరకూ పోలింగ్ జరిగే అవకాశాలున్నాయని తెలిపారు. 90శాతం పోలింగ్ జరిగినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని భూమా బ్రహ్మానందరెడ్డి చెప్పారు. కాగా, బుధవారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఆగస్టు 28న పోలింగ్ ఫలితాలు వెలువడనున్నాయి.

English summary
TDP Nandyal MLA candidate Bhuma Brahmananda Reddy on Wednesday said that nandyal bypoll voting percentage may will raise to 90%.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X