మోడీకి లోకేష్ ఝలక్, షాకింగ్ ప్రశ్న.. పెట్రోల్ ఖర్చు కూడా బ్రాహ్మణే ఇస్తుంది
గుంటూరు: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తర్వాత టిడిపి యువనేత నారా లోకేష్ కూడా ప్రధాని నరేంద్ర మోడీకి షాకిచ్చారు! రూ.2వేల నోట్లతో మరో కొత్త సమస్య వచ్చిందని లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రూ.2వేల నోటు అవసరం లేదని అభిప్రాయపడ్డారు.
అవినీతి నిర్మూలించాలంటే నగదు బదలీయే ఉత్తమ పరిష్కారం అన్నారు. రూ.2వేల నోటు తేవడాన్ని చంద్రబాబు కూడా ప్రశ్నించిన విషయం తెలిసిందే. పెద్ద నోట్ల రద్దు కోసం నిరంతరం పోరాడుతామని ఆయన చెప్పారు.
అమరావతి నిర్మాణంపై..
రాజధాని అమరావతి నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు కష్టపడుతుంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అడ్డుకోవడమే అజెండాగా పెట్టుకున్నారని విమర్శించారు. ఎవరు అడ్డుపడినా ఎన్ని ఆటంకాలు సృష్టించినా అమరావతి నిర్మాణం ఆగబోదన్నారు.

గుంటూరు జిల్లాలోని చలపతి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులతో లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలని, సామాజిక, వర్తమాన వ్యవహారాలపై అవగాహన పెంచుకోవాలన్నారు.
వ్యక్తులు, రాజకీయాలు శాశ్వతం కాదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ చట్టబద్ధత కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు పోరాడుతున్నారన్నారు. కేంద్రంతో తెగతెంపులు చేసుకోవడం రెండు నిమిషాల పని అని, తర్వాత రాష్ట్రానికి నిధులు, పరిశ్రమలు రాకపోతే ఎవరు బాధ్యత వహిస్తారన్నారు.
పెట్టుబడుల సాధన విషయంలో దేశంలోనే ఏపీ అగ్రగామిగా నిలిచిందన్నారు. రాజకీయాల్లో అవినీతి పోవాలంటే.. రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేయడమే సరైన మార్గమన్నారు. అయితే రూ.2000 నోట్లతో కొత్త సమస్య ఉత్పన్నమవుతుందన్నారు.
ప్రొఫెసర్ లక్ష్మిపై..
గుంటూరు జిల్లాలో సంధ్యారాణి మృతి కేసులో ప్రొఫెసర్ లక్ష్మి పైన చర్యలు పెద్ద పని కాదన్నారు. కానీ చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
బ్రాహ్మణి సంపాదిస్తుంటే..
ఓ విద్యార్థి ప్రశ్నతో లోకేష్ అవాక్కయ్యారు. భువనేశ్వరి (లోకేష్ అమ్మ), బ్రాహ్మణి (లోకేష్ భార్య) సంపాదిస్తుంటే మీరు ఖర్చు పెడుతున్నారా అని విద్యార్థులు ప్రశ్నించారు. దీనిపై లోకేష్ మాట్లాడుతూ.. తొలి నుంచి తమ ఖర్చులను అమ్మే చూస్తోందని చెప్పారు. తనకు కారు పెట్రోలు ఖర్చులు కూడా భార్య బ్రాహ్మణియే ఇస్తోందన్నారు. తన అమ్మ తన తండ్రికి ఇరవై ఏళ్లుగా ఖర్చులకు ఇస్తోందన్నారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications