30 మంది చనిపోతే చీమకుట్టినట్లయినా లేదు: జగన్ సర్కార్పై నారా లోకేశ్ ఫైర్
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఫైరయ్యారు. ప్రజల సంక్షేమాన్ని వారు మరిచారని దుయ్యబట్టారు. నాటుసారా, శానిటైజర్ తాగి చనిపోతున్న నేపథ్యంలో లోకేశ్ స్పందించారు. ఈ మేరకు వరసగా ట్వీట్లు చేశారు. 30 మంది చనిపోయిన ప్రభుత్వానికి పట్టనట్టు లేదని మండిపడ్డారు. వారి మృతికి ప్రభుత్వమే కారణం అని ఆరోపించారు. పెద్ద దిక్కు కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.
ప్రభుత్వ దుకాణాలు తెరిచి, సొంత బ్రాండ్లు తెచ్చి, రేట్లు పెంచి మద్యపాన నిషేధం అంటూ కొత్త నిర్వచనం చెప్పారు @ysjagan గారు. ఇప్పుడు శానిటైజర్ తాగించి ప్రజల్ని పొట్టన పెట్టుకోవడం కూడా మద్యపాన నిషేధంలో భాగమే అంటారేమో!(1/3) pic.twitter.com/LIBR2Y1vb7
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) August 8, 2020
వైన్ షాపుల్లో సొంత బ్రాండ్లు తీసుకొచ్చారని లోకేశ్ విమర్శించారు. ఆ బ్రాండ్ల రేట్లు పెంచి మద్యపాన నిషేధం అంటూ కొత్త భాష్యం చెప్పారని తెలిపారు. ఇప్పుడు శానిటైజర్ తాగించి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని పేర్కొన్నారు. ఇదీ కూడా మద్యపాన నిషేధంలో భాగమే అంటారేమో అంటూ సెటైర్లు వేశారు. ఇప్పటివరకు 30 మంది చనిపోయిన.. ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదన్నారు.

తిరుపతిలో కూడా నలుగురు శానిటైజర్ తాగి చనిపోవడం బాధాకరం అన్నారు. రాష్ట్రంలో జరుగుతోన్న హత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు. వారి కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ మద్యం పేరుతో సమాంతర మాఫియా నడుపుతోందని ఆరోపించారు. జగన్ రెడ్డి సర్కార్పై జ్యుడిషీయల్ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేశారు.
నాటు సారా, శానిటైజర్లు తాగి రాష్ట్రవ్యాప్తంగా 30 మంది చనిపోయినా ఈ దున్నపోతు ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. తిరుపతిలో శానిటైజర్లు తాగి నలుగురు మృతి చెందటం బాధాకరం. ఇవన్నీ ప్రభుత్వ హత్యలే.(2/3)
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) August 8, 2020
ఇదిలా ఉంటే మద్యం ధరలు తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. మందు ధర పెరగడంతో కొందరు సారా, శానిటైజర్ తాగుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో నిర్ణయానికి వచ్చింది. 30 నుంచి 40 శాతం మందుపై ధర తగ్గిస్తారని తెలుస్తోంది.
వారి కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలి. మద్యంపేరుతో సమాంతర మాఫియా నడుపుతున్న జగర్రెడ్డి సర్కారుపై జ్యుడీషియల్ ఎంక్వయిరీ వేయాలి.(3/3)
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) August 8, 2020
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications