షాక్: లోకేష్ కోసమే ‘పది’ ఫలితాలు వాయిదా వేశారా?
పదవ తరగతి ఫలితాల విడుదలకు వాయిదా పడటానికి కారణం ఇదేనంటూ ఓ వార్త సంచలనంగా మారింది. మంత్రి లోకేష్ విశాఖపట్నం పర్యటన కోసమే ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షా ఫలితాల విడుదల సమయాన్ని మార్చారని వార్తలు వినిప
విజయవాడ: పదవ తరగతి ఫలితాల విడుదలకు వాయిదా పడటానికి కారణం ఇదేనంటూ ఓ వార్త సంచలనంగా మారింది. మంత్రి లోకేష్ విశాఖపట్నం పర్యటన కోసమే ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షా ఫలితాల విడుదల సమయాన్ని మార్చారని వార్తలు వినిపిస్తున్నాయి.
పదవ తరగతి ఫలితాలను శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలను విడుదల చేయాలని తొలుత నిర్ణయించారు. అయితే, మంత్రి గంటా శ్రీనివాసరావు మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేశారు. విజయవాడలో ఫలితాలను విడుదల చేయాల్సివుండగా, లోకేష్ పర్యటనలో పాల్గొనేందుకోసం మంత్రి గంటా వేదికను విశాఖకు మార్చినట్లు సమాచారం.
విశాఖలో లోకేష్ పర్యటన ముగిసిన తర్వాత టెన్త్ ఫలితాలను విడుదల చేయనున్నారు మంత్రి గంటా. కాగా, లక్షలాదిమంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఫలితాల కోసం ఎదురుచూస్తుంటే.. లోకేష్ పర్యటన కోసం వాయిదా వేశారంటూ ప్రచారం జరగడంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.