ఆది పశువులా, పిచ్చికుక్కను కొట్టినట్లు కొడ్తాం: నారమల్లి పద్మజ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆదినారాయణ రెడ్డిపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి నారమల్లి పద్మజ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సంతలో పశువులా అమ్ముడుపోయిన ఆదినారాయణ రెడ్డికి తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ను విమర్శించే స్థాయి లేదని అన్నార.
చంద్రబాబు వేసిన బిస్కట్కు అమ్ముడుపోయి, జగన్పై రెచ్చిపోయి మాట్లాడితే రోడ్డు మీద పిచ్చికుక్కను కొట్టినట్లు కొట్టడానికి సిద్ధంగా ఉన్నామని ఆమె వ్యాఖ్యానంచించారు ఆమె శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు.

చంద్రబాబు మంత్రులను ఉసిగొల్పుతూ...
చంద్రబాబు తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఆంబోతుల్లాంటి మంత్రులను ఉసిగొల్పి వైయస్ జగన్పై ఆరోపణలు చేయిస్తున్నారని పద్మజ అన్నారు. తమ నాయకుడు చంద్రబాబు నాలుగేళ్లుగా ఏం చేశాడో చెప్పే ధైర్యం లేక ప్రతిపక్షంపై ఆదినారాయణ రెడ్డి విమర్శలు చేస్తున్నారని అన్నారు.

యాత్రకు ఆదరణను చూసి...
వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్రకు వస్తున్న ఆదరణను చూసి టిడిపి నేతలు భయపడుతున్నారని పద్మజ అన్నారు. మాట తప్పడం, వెన్నుపోటు పొడవడం, అవినీతికి పాల్పడే చంద్రబాబు పంచన తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే నాయకులు చేరి దొంగ స్వామీజీల్లా మైకుల ముందుకు వచ్చి మాట్లాడుతున్నారని అన్నారు.

ఆదికి ధైర్యం లేక
పార్టీ ఫిరాయించి రాజీనామా చేసే ధైర్యం లేని ఆదినారాయణ రెడ్డి సచివాలయం సాక్షిగా మీడియా సమావేశం ఏర్పాటు చిస రామసుబ్బారెడ్డి, తాను చెరో 50 శాత వాటాలు పంచుకుంటున్నట్లు చెప్పడం సిగ్గుచేటు అని పద్మజ అన్నారు. కేశవరెడ్డి విద్యాసంస్థల ద్వారా రూ.80 కోట్ల స్కాం జరిగితే దాని నుంచి తప్పించుకోవడానికి ఆదినారాయణ రెడ్డి పార్టీ ఫిరాయించిన సంగతి అందరికీ తెలుసునని అన్నారు.

ఆది దొంగనా, దొరనా....
ఇంతకీ ఆదినారాయణ రెడ్డి దొంగనా, దొరనా అని పద్మజ ప్రశ్నించారు. చంద్రబాబుకు, జగన్కు నక్కకూ నాకలోకానికి ఉన్నంత తేడా ఉందని అన్నారు. వంద ఏళ్ల కాంగ్రెసును ఎదిరించి ప్రత్యేక పార్టీ పెట్టి 67 మంది ఎమ్మెల్యేలన గెలిపించుకున్న గుండె ధైర్యం గల నాయకుడు జగన్ అని ఆమె అన్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications