వైసీపీ హిట్ లిస్ట్ లోకి ఆ పార్టీ అధ్యక్షుడు..! విడదల రజనీ టార్గెట్ తో..!
ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటివరకూ నేరుగా రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు, ప్రతివిమర్శలు, కౌంటర్లు, పంచ్ లు చూస్తున్నాం. కానీ తొలిసారిగా ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడు ప్రత్యర్ది పార్టీ తమ కార్యకర్తల కోసం ప్రారంభించిన హిట్ లిస్ట్ లోకి వచ్చి చేరారు. దీంతో ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతోంది. ఇంతకీ ఇలా మరో పార్టీ హిట్ లిస్ట్ లో చేరిన సదరు పార్టీ అధ్యక్షుడెవరో, దాని వెనుక ఉన్న కథేంటో ఇప్పుడు చూద్దాం..
వైసీపీ తాజాగా కూటమి ప్రభుత్వంలో దాడులకు గురవుతున్న, ఇబ్బందులు పడుతున్న తమ కార్యకర్తల కోసం డిజిటల్ బుక్ ప్రారంభించింది. ఇందులో వారిని ఇబ్బందిపెడుతున్న వారిపై ఫిర్యాదులు చేయాలని తమ క్యాడర్ కు సూచించింది. అయితే ఇందులో అనూహ్యంగా వైసీపీ మాజీ మంత్రి విడదల రజనీ తమపై దాడి చేసిందంటూ నవతరం పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రమణ్యం ఫిర్యాదు చేశారు. అంటే తన ప్రత్యర్థి పార్టీ తమ కార్యకర్తల కోసం పెట్టిన హిట్ లిస్ట్ లో వాళ్ల పార్టీ నాయకురాలిపైనే ఫిర్యాదు చేశారన్నమాట.

దీంతో వైసీపీకి చిర్రెత్తుకొచ్చింది. తమ పార్టీ నేత విడదల రజనీని టార్గెట్ చేస్తూ పబ్లిసిటీ కోసం ఇలా చేస్తారా అంటూ రావు సుబ్రమణ్యంపై సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది. అంతే కాదు ఆయన్ను వాళ్ల హిట్ లిస్ట్ లో కూడా చేర్చారట. ఈ విషయాన్ని స్వయంగా నవతరం పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రమణ్యమే వెల్లడించారు. తాను చేసిన ఫిర్యాదుపై స్పందించి న్యాయం చేయకపోగా డిజిటల్ బుక్ నిర్వహణ సంస్థ అయినటువంటి WeYSRCP అధికారిక ట్విట్టర్ ఖాతాలో బెదిరింపులు చేస్తూ తన పేరుతో పోస్ట్ పెట్టడం తనని ఎంతో బాధించినట్లు రావు సుబ్రహ్మణ్యం తెలిపారు.
విడదల రజిని ఎటువంటి తప్పు చేయలేదు అని జగన్ సమర్ధించడం సరికాదని, దాడి చేసిన వ్యక్తి జగన్, రజనితో కలసి దిగిన ఫోటో మీడియా సమావేశంలో విడుదల చేశారు. కూటమికి మద్దత్తు ఇచ్చిన మాట వాస్తవం అని, జగన్ హయాంలో జరిగిన దాడులు చూసే కూటమికి మద్దత్తు ఇచ్చామని తెలిపారు. అధికారంలో లేనప్పుడే ఇలాంటి బెదిరింపులు చేస్తే రేపు జగన్ అధికారం లోకి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే భయం వేస్తుందన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హోమ్ మినిస్టర్ అనిత వైస్సార్సీపీ బెదిరింపులు చేస్తూ పెట్టిన ట్వీట్ గమనించి నాకు తగిన భద్రత కల్పించాలని రావు సుబ్రహ్మణ్యం విజ్ఞప్తి చేశారు. డిజిటల్ బుక్ లో సామాన్య ప్రజలకు న్యాయం జరగదని, కేవలం విడదల రజిని వంటి వైస్సార్సీపీ నేతలకు మాత్రమే న్యాయం జరుగుతుంది అని తెలిపారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications