వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వైసీపీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన నేదురుమల్లి రామ్కుమార్
నెల్లూరు: దివంగత మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్రెడ్డి కుమారుడు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి త్వరలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరికపై స్పష్టతనిచ్చారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను త్వరలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు తెలిపారు.
ప్రసుత్త పరిస్థితుల్లో రాష్ట్రానికి వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వం అవసరముందన్నారు. వైయస్సార్ కుటుంబానికి తమ కుటుంబానికి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. నేదురుమల్లి అభిమానులందరు తనతో కలిసి రావాలని కోరారు.
Recommended Video
జంపింగ్
ఎంపీలను
తొలగించండి
త్వరలోనే కార్యకర్తలు అభిమానులతో కలిసి వైయస్సార్సీపీ చేరుతానని నేదురుమల్లి వెల్లడించారు. పార్టీ మారే అంశంపై చర్చించడానికి జిల్లాలోని నేదురుమల్లి అభిమానులు, కార్యకర్తలతో రామ్కుమార్రెడ్డి బుధవారం సమావేశమయ్యారు.
English summary
It is said that Nedurumalli Ramkumar Reddy will join YSR Congress party soon.
Story first published: Thursday, August 9, 2018, 23:25 [IST]