నెల్లూరులో బ్లేడ్ బ్యాచ్ అరెస్ట్.. పోలీసులు ఊహించని శిక్ష..
నెల్లూరులోని బోసుబొమ్మ జంక్షన్ లో ఆదివారం ఓ బ్లేడ్ బ్యాచ్ వీరంగం సృష్టించిన విషయం తెలిసిందే. మద్యం మత్తులో బైక్స్ తో బస్సును వెంబడించి రోడ్డు మధ్యలోనే బస్సులోకి దూరారు దుండగులు. ప్రయాణికులు చూస్తుండగానే సిటీ బస్సు డ్రైవర్, కండక్టర్లపై బ్లేడుతో దాడి చేసి పరారయ్యారు. అయితే ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. నిందితులను 24 గంటల వ్యవధిలోపే అరెస్ట్ చేశారు. అయితే వారికి ఊహించని శిక్ష విధించారు.
నెల్లూరులో సిటీ బస్సు డ్రైవర్, కండక్టర్లపై బ్లేడుతో దాడి చేసిన ఐదుగురు నిందితులను 24 గంటల వ్యవధిలోపే పోలీసులు అరెస్ట్ చేశారు. వారికి వినూత్నమైన శిక్ష విధించారు. గాంధీ బొమ్మ నుంచి కూరగాయల మార్కెట్ వరకు ఐదుగురు నిందితులను రోడ్డుపైన నడిపిస్తూ ఊరేగించారు పోలీసులు. దాడులు, హత్యలకు పాల్పడితే ఇక నుంచి నిందితులకు ఇలాంటి ట్రీట్ మెంట్ ఉంటుందని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. యువత సన్మార్గంలో నడుచుకోవాలని, నేరాలకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని పోలీసుల సూచనలు చేశారు. పిల్లలు తప్పు దోవ పట్టకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని హితవు పలికారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు గ్రామీణ మండలంలోని మహాత్మాగాంధీనగర్ కు చెందిన మన్సూర్ డ్రైవర్ గా పనిచేస్తున్నారు. అలాగే ఇందుకూరుపేటకు చెందిన సలామ్ కండక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే మద్యం మత్తులో కొందరు యువకులు రోడ్డుకు అడ్డంగా బైక్ లు పెట్టి మాట్లాడుకుంటున్నారు. డ్రైవర్ హారన్ కొట్టినా వాళ్లు పట్టించుకోలేదు. దీంతో డ్రైవర్, కండక్టర్ కిందకు దిగి ఓ బైక్ తాళం తీసుకుని బస్సులో వెళ్లిపోయారు. దీంతో ఆ యువకులు బస్సును వెంబడించారు. అలా బస్సులో దూరి డ్రైవర్, కండక్టర్ పై విచక్షణా రహితంగా బ్లేడ్స్ తో గాయపరిచారు. వెంటనే స్థానికులు వారిని సమీప ఆస్పత్తికి తరలించారు.
డ్రైవర్–కండక్టర్లపై బ్లేడ్ దాడి దుండగులకు ధర్మసిక్ష.!
— oneindiatelugu (@oneindiatelugu) December 8, 2025
రోడ్డుపైనే నడిపించిన పోలీసులు, వీడియో వైరల్!#APPolice #Nellore #AndhraPradesh #ViralWatch #Oneindia #OITelugu
సిటీ బస్సు డ్రైవర్, కండక్టర్పై బ్లేడుతో దాడి చేసి, హత్యాయత్నానికి పాల్పడిన ఐదుగురు నిందితులను పోలీసులు 24… pic.twitter.com/Et5dHUX0Kp
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. 24 గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేశారు. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారికి వినూత్న శిక్ష విధించారు. గాంధీ బొమ్మ నుంచి కూరగాయల మార్కెట్ వరకు ఐదుగురు నిందితులను రోడ్డుపైన నడిపిస్తూ ఊరేగించారు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications