మంత్రి పదవి ఆశించలేదు.. రాలేదని నిరాశా లేదు, ఎన్నో సమీకరణాలు ఉంటాయి: ఎంపీ హరిబాబు
తాజా కేంద్రమంత్రివర్గ విస్తరణలో తనకు అవకాశం వస్తుందని తానేమీ ఆశించలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు స్పష్టం చేశారు. పదవి రాలేదని తాను ఎలాంటి నిరాశ చెందలేదని ఆయన వ్యాఖ్యాని
విశాఖపట్నం: తాజా కేంద్రమంత్రివర్గ విస్తరణలో తనకు అవకాశం వస్తుందని తానేమీ ఆశించలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు స్పష్టం చేశారు. పదవి రాలేదని తాను ఎలాంటి నిరాశ చెందలేదని ఆయన వ్యాఖ్యానించారు.
అయితే కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ఆయనకు మంత్రి పదవి లభిస్తుందని బీజేపీ వర్గాలు ఆశలు పెట్టుకున్నాయి. శనివారం రాత్రి హరిబాబు కుటుంబసమేతంగా ఢిల్లీ వెళ్లడంతో... ఆ పార్టీ శ్రేణులు సంబరపడ్డాయి. నగరానికి చెందిన కొంతమంది నాయకులు సైతం శనివారం రాత్రే ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.

కానీ అర్ధరాత్రి వరకూ వేచి చూసినా హరిబాబు పేరు బయటకు రాలేదు. ఆదివారం ఉదయమైనా వెల్లడిస్తారేమోనని ఆశగా ఎదురు చూసినా.. అదీ జరగలేదు. ఆఖరు నిముషంలో హరిబాబుకు కేంద్ర మంత్రి పదవి చేజారిపోవడానికి కారణాలేమిటన్న దానిపై పార్టీలో చర్చ జరుగుతోంది.
బీజేపీ అధ్యక్షుడిగా హరిబాబు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీతో స్నేహపూర్వక సంబంధాలు నెరపడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. బీజేపీ, టీడీపీ సంబంధాల మధ్య ఎలాంటి విభేదాలు తలెత్తకుండా చూడగలుగుతున్నారు.
వచ్చే రెండేళ్లలోనూ పార్టీ పరంగా కీలకంగా వ్యవహరించాల్సి ఉన్నందున తాజా విస్తరణలో అవకాశం ఇవ్వలేదేమోనన్న చర్చ జరుగుతోంది. దీనిపై హరిబాబు స్పందించారు.
పార్టీ అప్పగించిన ఎలాంటి బాధ్యతలనైనా సమర్ధంగా నిర్వహించాలనే తాను కోరుకుంటానని చెప్పారు. మంత్రివర్గ విస్తరణకు హాజరయ్యేందుకే ఢిల్లీ వెళ్లానని, పార్టీ పెద్దల నుంచి పిలుపొచ్చి కాదని అన్నారు.
మంత్రి పదవి ఇవ్వాలంటే చాలా రకాలైన సమీకరణాలు చూసుకోవాల్సి ఉంటుందని, అన్నీ అనుకూలిస్తేనే పదవులు వరిస్తాయన్నారు. పార్టీలో నిబద్ధత ఉన్న నాయకుడిగా అన్ని ఇబ్బందులను దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉందని హరిబాబు వ్యాఖ్యానించారు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications