పెళ్లయిన 4 నెలలకే విషాదం: ఆ విషయంలో మనస్పర్థలు, భార్యాభర్తల ఆత్మహత్య!
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా రొయ్యలగూడెం మండలం చొప్పనరామన్నగూడెంలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లయి నాలుగు నెలలు తిరగకుండానే ఓ జంట ఆత్మహత్యకు పాల్పడింది.
వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన విజయరాజు, ప్రియాంకలకు 4నెలల క్రితం పెళ్లి జరిగింది. అయితే పెళ్లి తర్వాత కాపురం ఎక్కడ పెట్టాలనే విషయంలో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. హైదరాబాద్ వెళ్దామని భార్య.. గ్రామంలోనే ఉందామని రాజు వాదించుకుంటున్నారు.

ఈ నేపథ్యంలోనే ఆదివారం రాత్రి కూడా భార్య భర్తల మధ్య ఇదే విషయమై వాగ్వాదం జరిగింది. ఆపై ఏమైందో ఏమో తెలియదు కానీ అర్థరాత్రి సమయంలో ప్రియాంక ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రియాంక ఆత్మహత్యతో మనస్థాపం చెందిన విజయరాజు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొత్త జంట అఘాయిత్యానికి పాల్పడటంతో ఇరు కుటుంబాల్లోనూ విషాదం నెలకొంది.
More From
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications