Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కేంద్రం తాజా నిర్ణయం తో అమరావతిలో కీలక మలుపు..!!

ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగిసింది. ప్రధానితో సహా పలువురు కేంద్ర మంత్రులను కలిసారు. రాష్ట్రానికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఆర్దికంగా తోడ్పాటు పై అభ్యర్దించారు. పోలవరం ప్రస్తుత పరిస్థితిని వివరించారు. ఏపీకి కేంద్ర ప్రాజెక్టుల పైన చర్చలు చేసారు. అమరావతి నిర్మాణం లో భాగంగా కేంద్రం నుంచి కావల్సిన మద్దతు పై నివేదిక ఇచ్చారు. ఈ సమయంలో కేంద్రం కీలక హామీ ఇచ్చింది. అమరావతి నిర్మాణంలో ఈ నిర్ణయం కీలకం కానుంది.

అమరావతిపై కసరత్తు
ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసారు. అమరావతి ప్రస్తుత పరిస్థితుల పైన కేంద్రానికి నివేదించారు. కేంద్ర శాఖల నుంచి సహకారం కోరారు. అమరావతిలో మౌళిక వసతుల కల్పనలో భాగంగా ముందుగా రోడ్ల నిర్మాణం పైన ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్‌ గడ్కరీ తో చంద్రబాబు సమావేశమైన సమయంలో రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రహదారి ప్రాజెక్టులు, కొత్తగా చేపట్టాల్సిన రహదారులపై ఆయనకు ప్రతిపాదనలు సమర్పించారు. అమరావతి ఔటర్‌, ఇన్నర్‌ రింగ్‌రోడ్డుతోపాటు, విజయవాడలోని కీలక ప్రాంతాలను కలిసే తూర్పు బైపాస్‌ చేపట్టాలన్న చంద్రబాబు విన్నపానికి గడ్కరీ సానుకూలంగా స్పందించారు.

Nitin Gadkari responded positively and agreed for the construction of the Amaravati outer ring road

ఏపీకి కేంద్రం హామీ
అమరావతి రాజధానికి మణిహారం లాంటి ఔటర్‌ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్‌) నిర్మాణానికి కేంద్రం సానుకూలత వ్యక్తం చేసింది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో 189 కిమీ పొడవైన ఓఆర్‌ఆర్‌ను తానే చేపట్టేందుకు ముందుకొచ్చింది. పెరిగిన ట్రాఫిక్‌, నూతన వాహనాల తీరును దృష్టిలో పెట్టుకుని అత్యాధునిక టెక్నాలజీతో ఔటర్‌ నిర్మాణం చేద్దామని నితిన్‌ గడ్కరీ సీఎం చంద్రబాబుకు స్పష్టమైన హామీఇచ్చారు. ఖర్చు ఎంతైనా అమరావతికి అద్భుతమైన రహదారిని నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఔటర్‌ నిర్మాణం కోసం ఇప్పటికే భూసేకరణ ప్లాన్‌ను సిద్ధం చేశారు. రూ.18 వేల కోట్లతో దీన్ని నిర్మించాలని 2017-18లోనే ప్రతిపాదించగా కేంద్రం అప్పట్లోనే అంగీకరించింది.

మౌళిక వసతుల పై ఫోకస్
ప్రజలకు, మౌలిక రంగం మరింత బలోపేతమయ్యేందుకు అవసరమైన సహకారమందిస్తామని గడ్కరీ హామీ ఇచ్చారు. ఆ 3ప్రాజెక్టులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.ఈ నేపథ్యంలో సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్‌)లు రూపొందించేందుకు రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. రాష్ట్రంలో 7 వేల కిమీపైనే జాతీయ రహదారులున్నాయి. ప్రస్తుతం స్టేట్‌ హైవేలుగాఉన్న 3,200 కిమీ రోడ్లను కూడా జాతీయ రహదారులుగా అభివృద్ధి చేయాలని గడ్కరీకి చంద్రబాబు ప్రతిపాదించినట్లు తెలిసింది. ఏపీలో కూడా కొత్తగా చేపట్టే పెద్ద ప్రాజెక్టులు, జాతీయ రహదారులను అవసరాన్ని బట్టి సీసీ టెక్నాలజీతో నిర్మించేలా ప్రతిపాదనలు ఉండాలని గడ్కరీ సూచించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+