మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కిరణ్ రెడ్డి కన్నా నిజాం గొప్ప: కోదండరామ్ కితాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

Kodandaram
మెదక్: నిరంకుశపాలన సాగించినా సాగునీరిచ్చిన హైదరాబాద్ నిజాం రాజు ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కన్నా గొప్పోడని తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరాం అన్నారు. కిరణ్ కుమార్ ఉన్న ప్రాజెక్టులకు నీరు ఇవ్వడం లేదని, నిజాం ప్రాజెక్టులు నిర్మించడానికి పునాదులు వేశాడని ఆయన అన్నారు.

కలిసి ఉంటే కష్టాలు తప్ప ఒరిగేదేమిలేదనీ, అందుకే తెలంగాణ రాష్ట్రం కోరుకుంటున్నామని ఆయన అన్నారు. తెలంగాణ బిల్లుపై శానససభలో చర్చకు ఇచ్చిన వారం రోజుల గడువుతో నష్టం లేదని, పార్లమెంట్‌లో టి బిల్లు పాసవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

శుక్రవారం మెదక్ మండలం సర్దన జెడ్పీ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులనుద్దేశించి కోదండరామ్ ప్రసంగించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అసెంబ్లీలో మాట్లాడే భాష ఎవరికీ అర్థం కావడం లేదన్నారు. ప్రాజెక్టు నీళ్లు రాక బోర్లు వేసుకున్నా విద్యుత్ లేక పంటలు పండక అప్పులు చేసి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన అన్నారు.

ముఖ్యమంత్రి దృష్టిలో రైతుల బాగు ఇదేనా అని ప్రశ్నించారు. నిజాం పాలనలో నిరంకుశమైన రాచరికం నడిచిందన్నారు. 1956 ఆంధ్రాతో కలిస్తే ఒక్క ఒప్పందం అమలుకాకపోగా సర్వనాశనమయ్యామని ఆయన అన్నారు.. 1990 నుండి ఘన్‌పూర్ ఆనకట్ట కింద గల మహబూబ్‌నహర్ చివరి ఆయకట్టుకు నీరందడం లేదని చెప్పారు.

English summary

 Telangana JAC chairman Kodandaram said that Hyderabad Nizam was greater than CM Kiran kumar Reddy as welfare measures are concerned.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X